News November 21, 2024

ధనుష్‌తో వివాదం వేళ నయనతార మరో ట్వీట్

image

నెట్‌ఫ్లిక్స్ తనపై రూపొందించిన డాక్యుమెంటరీలో తమ సినిమాల ఫుటేజ్‌ను వాడుకునేందుకు అనుమతినిచ్చిన నిర్మాతలకు నయనతార కృతజ్ఞతలు తెలిపారు. అడిగిన వెంటనే ఆలస్యం చేయకుండా తనకు NOC ఇచ్చారంటూ చిరంజీవి, షారుఖ్ ఖాన్‌, రామ్ చరణ్ సహా పలువురి పేర్లను ఆమె ప్రకటించారు. కాగా ‘నానుమ్ రౌడీ దానే’ మూవీ క్లిప్స్ వాడుకునేందుకు హీరో ధనుష్ NOC ఇవ్వకుండా రూ.10 కోట్లు డిమాండ్ చేయడంపై ఇటీవల నయన్ ఆగ్రహించిన సంగతి తెలిసిందే.

Similar News

News October 17, 2025

తల్లిపాలు పెంచే ఫుడ్స్ ఇవే..

image

మొదటిసారి తల్లైన తర్వాత మహిళలకు ఎన్నో సవాళ్లు వస్తుంటాయి. వాటిల్లో ఒకటే తగినంత పాలు ఉత్పత్తికాకపోవడం. ఇలాంటప్పుడు కొన్ని ఆహారాలను డైట్‌లో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. పాలకూర, మెంతికూర, బ్రకోలీ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్, వెల్లుల్లి, ఓట్స్, నువ్వులు, మెంతులు తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు. అలాగే వ్యాయామాలు, ధ్యానం చేయడం కూడా మంచిదని సూచిస్తున్నారు.

News October 17, 2025

దమ్ముంటే కల్తీ మద్యంపై అఖిలపక్ష కమిటీ వేయండి: పేర్ని నాని

image

AP: తమ హయాంలోని QR కోడ్ పద్ధతిని కూటమి తొలగించి కల్తీ మద్యంతో భారీ ఎత్తున దోచుకుందని YCP నేత పేర్ని నాని దుయ్యబట్టారు. ‘ఈ ప్రభుత్వ బార్ పాలసీ వెనుక స్కామ్ ఉంది. నకిలీ మద్యం అమ్మకం కోసమే రూ.99 లిక్కర్‌ ఆపేశారు. రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం తెచ్చి అమ్మారు’ అని ఆరోపించారు. దీన్ని నిరూపించడానికి తాను సిద్ధమని, దమ్ముంటే అన్ని పార్టీల నేతలతో నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

News October 17, 2025

నేలపై కూర్చొని తింటే ఎన్ని లాభాలో..

image

నేలపై కూర్చొని భోజనం చేసే పవిత్రమైన ఆచారం భారత్‌లో ఎప్పటి నుంచో ఉంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. మనం నేలపై కూర్చొని తినడం పద్మాసన భంగిమను పోలి ఉంటుంది. ఈ పద్ధతి జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి.. నేలపై కూర్చొని వినయంతో తినడం ఆహారం పట్ల మన గౌరవాన్ని సూచిస్తుంది. ఈ ఆచారాన్ని దైవ ప్రసాదంగా స్వీకరించాలని పండితులు చెబుతున్నారు.