News November 21, 2024
ధనుష్తో వివాదం వేళ నయనతార మరో ట్వీట్

నెట్ఫ్లిక్స్ తనపై రూపొందించిన డాక్యుమెంటరీలో తమ సినిమాల ఫుటేజ్ను వాడుకునేందుకు అనుమతినిచ్చిన నిర్మాతలకు నయనతార కృతజ్ఞతలు తెలిపారు. అడిగిన వెంటనే ఆలస్యం చేయకుండా తనకు NOC ఇచ్చారంటూ చిరంజీవి, షారుఖ్ ఖాన్, రామ్ చరణ్ సహా పలువురి పేర్లను ఆమె ప్రకటించారు. కాగా ‘నానుమ్ రౌడీ దానే’ మూవీ క్లిప్స్ వాడుకునేందుకు హీరో ధనుష్ NOC ఇవ్వకుండా రూ.10 కోట్లు డిమాండ్ చేయడంపై ఇటీవల నయన్ ఆగ్రహించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 20, 2025
MHBD: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు: DEO

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని DEO దక్షిణామూర్తి అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలను MHBDలోని గ్రంథాలయంలో నిర్వహించారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ప్రజలలో సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక చైతన్యాన్ని తీసుకురావడంలో గ్రంథాలయాలు ఎంతో తోడ్పడతాయని అన్నారు. కార్యదర్శి తూర్పాటి శ్రీలత ఉన్నారు.
News November 20, 2025
పంచాయతీ ఎన్నికలపై కీలక సమీక్ష

TG: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. CS రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర అధికారులతో సమీక్షించారు. స్థానిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని ఆమె ఆదేశించారు. కాగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 11, 14, 17న ఎలక్షన్స్ జరుగుతాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News November 20, 2025
ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తి

TG: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తయింది. ఆయన తన నిర్ణయాన్ని త్వరలో ప్రకటించనున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 10 మందిలో తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, డా.సంజయ్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య విచారణకు హాజరయ్యారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి హాజరుకాలేదు.


