News March 23, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు

image

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, SIBలో పనిచేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని 8 గంటలపాటు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీరిద్దరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రణీత్ రావుతో కలిసి వీరిద్దరూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

Similar News

News April 21, 2025

IPL రోబోటిక్ డాగ్ పేరు ఏంటంటే?

image

ఐపీఎల్‌లో కనిపిస్తున్న రోబోటిక్ డాగ్‌(కెమెరా)కు పేరు పెట్టారు. ఇటీవల నిర్వహించిన పోల్‌లో మెజారిటీ ఆడియన్స్ ఓట్ల ఆధారంగా ‘చంపక్’ అని పేరు పెట్టినట్లు IPL అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. ‘మీట్ చంపక్’ అని రాసుకొచ్చింది. ఆటగాళ్లతోనూ, చీర్ లీడర్స్‌తోనూ ఈ రోబోటిక్ డాగ్ సందడి చేసిన వీడియోలు వైరలయ్యాయి.

News April 21, 2025

‘ఖురేషీ’ ముస్లిం ఎన్నికల అధికారి .. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

image

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ SY ఖురేషీపై BJPఎంపీ నిశికాంత్ దూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఖురేషీ కమిషనర్‌గా ఉన్నకాలంలో ఝార్ఖండ్ సంతాల్ పరగణాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఓటర్లుగా మార్చారని, ఆయన ముస్లిం ఎన్నికల కమిషనర్‌ అని’ Xలో ఆరోపించారు. కాగా వక్ఫ్ చట్టం ముస్లిం భూములను లాక్కోవడానికి చేసిన ప్లాన్ అని సుప్రీం కోర్టు దానిని గుర్తిస్తుందని ఖురేషీ చేసిన ట్వీట్‌కు ఎంపీ రిప్లై ఇచ్చారు.

News April 21, 2025

ఈ వారంలో ‘కింగ్‌డమ్’ ఫస్ట్ సింగిల్: నాగవంశీ

image

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్‌డమ్’ మూవీపై నిర్మాత నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. ఈ వారంలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

error: Content is protected !!