News November 23, 2024

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జలవివాదం

image

ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి జల వివాదం చెలరేగింది. KC (కర్నూల్, కడప కెనాల్) కాలువకు కృష్ణా జలాలను వాడుకునేందుకు అనుమతించాలన్న AP సర్కార్ ప్రతిపాదనను TG వ్యతిరేకించింది. కేసీ కెనాల్‌కు తుంగభద్ర నుంచి కేటాయింపులు ఉన్నాయని, కృష్ణా నీటిని ఎలా వాడుకుంటారని ప్రశ్నించింది. AP ప్రతిపాదనకు బోర్డు అనుమతిస్తే తాము నష్టపోతామని పేర్కొంది. తుంగభద్ర బోర్డు భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది.

Similar News

News January 18, 2026

తల్లుల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చాం: CM

image

TG: చరిత్రలో హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్న దాఖలాలు లేవని సీఎం రేవంత్ మేడారంలో అన్నారు. ‘ఆనాడు ఫిబ్రవరి 6, 2023న ప్రజా కంఠక పాలనను గద్దె దించాలని ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించా. తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జీవితంలో ఏం చేశామని వెనక్కితిరిగి చూసుకుంటే సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేశానని గర్వంగా చెప్పుకుంటా’ అని తెలిపారు.

News January 18, 2026

దావోస్‌కు బయలుదేరిన CM చంద్రబాబు

image

AP: వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు CM చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం దావోస్‌కు బయల్దేరింది. రేపు ఉదయం 11 గంటలకు జ్యూరిచ్‌కు చేరుకోనుంది. సాయంత్రం తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని, రోడ్డు మార్గాన దావోస్‌కు CBN వెళ్లనున్నారు. UAE మంత్రి అబ్దుల్లా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌తో భేటీ కానున్నారు. ఆయన వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ ఉన్నారు.

News January 18, 2026

తెలంగాణ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు

image

* మెట్రో ఫేజ్ 2ఏ, ఫేజ్ 2బీ భూసేకరణకు సంబంధించి రూ.2,787 కోట్ల కేటాయింపునకు ఆమోద ముద్ర
* ములుగు జిల్లాలో సాగునీరు అందించేందుకు పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం
* 2027లో జులై 27- ఆగస్టు 3 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు బాసర-భద్రాచలం వరకు ఉన్న పురాతన ఆలయాల శాశ్వత అభివృద్ధి, ఎకో పార్కుల నిర్మాణానికి నిర్ణయం
* మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి నిర్ణయం