News October 28, 2024

ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఫంక్షన్‌లో తారల సందడి

image

ANR జాతీయ అవార్డు ఫంక్షన్‌లో టాలీవుడ్ తారలు సందడి చేశారు. రామ్ చరణ్, విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య, నాని, అఖిల్ హాజరయ్యారు. సినీ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్‌తో పాటు సుధీర్ బాబు, నాగచైతన్యకు కాబోయే సతీమణి శోభిత కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం హాజరయ్యారు.

Similar News

News February 4, 2026

తొందరపాటు వ్యాఖ్యలు వద్దు.. చంద్రబాబు, పవన్ నిర్ణయం

image

AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య రెండు గంటల సుదీర్ఘ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో రెండు ప్రధాన కులాల మధ్య చిచ్చు పెట్టేలా YCP వ్యవహరిస్తోందన్న అంశంపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ పరిస్థితుల్లో కూటమి నేతలు, క్యాడర్ జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించారు. జనసేన, టీడీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

News February 4, 2026

అదే రోజున ఓటీటీలోకి MSVPG ఏడు భాషల్లో రిలీజ్!

image

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం త్వరలో OTTలో సందడి చేయనుంది. ఇప్పటికే OTT సంస్థ జీ5 దీనిపై అనౌన్స్‌మెంట్ ఇచ్చినా డేట్ కన్ఫామ్ చేయలేదు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరిశారు.

News February 4, 2026

అసభ్యకరంగా కామెంట్స్.. పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!

image

సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఓ వ్యక్తి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తనను వేధిస్తున్నాడని ఆమె అతడి ఐడీతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ వేధింపులపై ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు సమర్థిస్తున్నారు.