News October 28, 2024
ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఫంక్షన్లో తారల సందడి
ANR జాతీయ అవార్డు ఫంక్షన్లో టాలీవుడ్ తారలు సందడి చేశారు. రామ్ చరణ్, విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య, నాని, అఖిల్ హాజరయ్యారు. సినీ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్తో పాటు సుధీర్ బాబు, నాగచైతన్యకు కాబోయే సతీమణి శోభిత కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం హాజరయ్యారు.
Similar News
News October 28, 2024
కుటుంబంలో చీలిక తెచ్చారు.. శరద్ పవార్పై అజిత్ ఫైర్
బారామతిలో తనకు వ్యతిరేకంగా మరొకరిని పోటీకి దింపి శరద్ పవార్ కుటుంబంలో చీలిక తెచ్చారని Dy.CM అజిత్ పవార్ విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో బారామతి నుంచి తన భార్యను పోటీకి దింపి తప్పు చేసినట్టు అంగీకరించానని, అయితే ఇప్పుడు ఇతరులు కూడా తప్పు చేస్తున్నట్టు కనబడుతోందన్నారు. అజిత్ సోమవారం నామినేషన్ వేశారు. అజిత్కు వ్యతిరేకంగా మనవడు యుగేంద్రను శరద్ పవార్ రంగంలోకి దింపారు.
News October 28, 2024
వారిని గద్దె దింపేందుకు ఐక్యంగా పనిచేద్దాం: అఖిలేశ్ యాదవ్
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సమష్టి వ్యూహాన్ని రచించడానికి ఐక్యంగా పనిచేయాలని MVA మిత్రపక్షాలకు SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ సూచించారు. బీజేపీ, అజిత్ పవార్, షిండేలను రాష్ట్ర శత్రువులుగా అభివర్ణించారు. వీరిని ఓడించి సానుకూల మార్పు తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు మతతత్వ, వెన్నుపోటు రాజకీయాల నుంచి MHకు విముక్తి కల్పిస్తాయని పోస్ట్ చేశారు.
News October 28, 2024
వెండి ధరలు మరింత పెరిగే అవకాశం!
రాబోయే 12-15 నెలల్లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో KG వెండి ధరలు ₹1.25 లక్షలకు చేరుకొనే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ సంస్థ అంచనా వేసింది. మధ్య, దీర్ఘకాలంలో స్వర్ణాన్ని మించి వెండి రాబడులు ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది MCXలో వెండి 40% పైగా పెరిగి ₹లక్ష మార్క్ను అధిగమించింది. ఇక బంగారానికి మీడియం టర్మ్లో ₹81 వేలు, లాంగ్ టర్మ్లో ₹86 వేల టార్గెట్ ప్రైస్ సెట్ చేసింది.