News September 23, 2024
ఏంటీ క్రేజ్.. కన్సర్ట్పై కోటి మంది ఇంట్రెస్ట్

ఇండియాలో జరగబోయే కోల్డ్ప్లే కన్సర్ట్ టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. టికెట్లు రిలీజయ్యే సమయంలో 1.3 కోట్ల మంది లాగిన్ అవ్వడంతో బుక్ మై షో వెబ్సైట్ క్రాష్ అయింది. దీంతో టికెట్స్ అందించేందుకు వెబ్సైట్ క్యూ సిస్టమ్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం 10 లక్షల మంది క్యూ సిస్టమ్లో టికెట్ల కోసం వేచి చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 18,19 తేదీల్లో ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో ఈ కన్సర్ట్ ఉండనుంది.
Similar News
News December 1, 2025
ధాన్యం కొనుగోళ్లు.. రూ.2,300 కోట్లు జమ చేేశాం: నాదెండ్ల

AP: రాష్ట్రంలో ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.2,300 కోట్ల నగదును రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ధాన్యం నిల్వలకు సంచుల కొరత లేకుండా చూస్తున్నామని, టార్పాలిన్లు ఉచితంగా రైతులకు అందిస్తున్నామని చెప్పారు.
News December 1, 2025
పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత

తన ప్రియుడు, డైరెక్టర్ రాజ్ నిడిమోరును వివాహమాడినట్లు స్టార్ హీరోయిన్ సమంత ప్రకటించారు. ఇవాళ్టి డేట్, లవ్ ఎమోజీలతో పెళ్లి ఫొటోలను ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు. కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్లోని లింగ భైరవ ఆలయంలో తొలుత నిశ్చితార్థం చేసుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఉపాసన కొణిదెల, అనుపమతో పాటు తదితర సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
News December 1, 2025
హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

HYDలోని CSIR-<


