News September 23, 2024

ఏంటీ క్రేజ్.. కన్సర్ట్‌పై కోటి మంది ఇంట్రెస్ట్

image

ఇండియాలో జరగబోయే కోల్డ్‌ప్లే కన్సర్ట్ టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. టికెట్లు రిలీజయ్యే సమయంలో 1.3 కోట్ల మంది లాగిన్ అవ్వడంతో బుక్ మై షో వెబ్‌సైట్ క్రాష్ అయింది. దీంతో టికెట్స్ అందించేందుకు వెబ్‌సైట్ క్యూ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం 10 లక్షల మంది క్యూ సిస్టమ్‌లో టికెట్ల కోసం వేచి చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 18,19 తేదీల్లో ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో ఈ కన్సర్ట్ ఉండనుంది.

Similar News

News November 26, 2025

పెద్దపల్లి: జిల్లా కలెక్టర్‌తో రాణి కుముదిని VC

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆమె జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇందులో పాల్గొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, నోటిఫికేషన్ ప్రకటన, టీపోల్ అప్డేట్లు, ఎన్నికల నియమావళి అమలు పటిష్ఠంగా ఉండాలని కమిషనర్ సూచించారు.

News November 26, 2025

iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.

News November 26, 2025

న్యూస్ అప్‌డేట్స్ @4PM

image

*తిరుమల పరకామణి కేసులో ముగిసిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ.. 4 గంటల పాటు ప్రశ్నించిన సీఐడీ అధికారులు
*ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు.. వారిపై రూ.1.19 కోట్ల రివార్డు
*HYD మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన NSN ఇన్ఫోటెక్ కంపెనీ.. 400 మంది నిరుద్యోగుల నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు
*ICC వన్డే ర్యాంకింగ్స్‌లో మరోసారి నం.1గా రోహిత్ శర్మ