News July 5, 2024
కశ్మీర్ వ్యతిరేక పార్టీకి బ్రిటన్లో అధికారం.. INDతో బంధం కొనసాగేనా?(1/2)

బ్రిటన్ ఎన్నికల్లో ఘనవిజయంతో కైర్ స్టార్మర్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే కశ్మీర్ అంశంలో భారత్కు వ్యతిరేకంగా లేబర్ పార్టీ భావజాలం ఉండటంతో 2 దేశాల బంధం ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. కశ్మీర్ ప్రజలకు నిర్ణయాధికారం ఇవ్వాలని, అక్కడికి అంతర్జాతీయ పరిశీలకులను పంపాలంటూ ఆ పార్టీ నేత జెరెమీ 2019లో తీర్మానాన్ని ఆమోదించారు. ఆ పార్టీవి ఓటు బ్యాంక్ రాజకీయాలంటూ అప్పట్లో భారత్ తీవ్రంగా మండిపడింది.
Similar News
News October 22, 2025
సత్య నాదెళ్లకు రూ.846 కోట్ల జీతం

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం భారీగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ప్యాకేజీ అంతకుమందు ఏడాదితో పోలిస్తే 22% అధికమైంది. ప్రస్తుతం ఆయన ఏడాదికి 96.5 మి.డాలర్ల (రూ.846 కోట్లు) జీతం అందుకుంటున్నారు. సత్య నాదెళ్ల, ఆయన లీడర్షిప్ టీమ్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మైక్రోసాఫ్ట్ పురోగతి సాధించిందని కంపెనీ బోర్డు తెలిపింది. అలాగే షేర్ల ధరలు పెరిగాయని పేర్కొంది.
News October 22, 2025
వయసుతో నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు

* స్నేహితులు దూరమైనా నీతో నీకున్న బంధమే ముఖ్యం
* జనాలు నీ కష్టం కాకుండా ఫలితాలను మాత్రమే చూస్తారు
* వైఫల్యాలు జీవితంలో భాగమే
* ఇల్లు లాంటి మంచి చోటు మరొకటి లేదు
* జీవితంలో ముఖ్యమైనవి కుటుంబం, డబ్బు
* వ్యాయామం మనసుకు శాంతి, శరీరానికి బలం ఇస్తుంది
* పశ్చాత్తాపం, కన్నీళ్లు మీ సమయాన్ని వృథా చేస్తాయి
* అదృష్టం కాదు.. మీరు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. Share it
News October 22, 2025
కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.