News July 5, 2024
కశ్మీర్ వ్యతిరేక పార్టీకి బ్రిటన్లో అధికారం.. INDతో బంధం కొనసాగేనా?(1/2)

బ్రిటన్ ఎన్నికల్లో ఘనవిజయంతో కైర్ స్టార్మర్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే కశ్మీర్ అంశంలో భారత్కు వ్యతిరేకంగా లేబర్ పార్టీ భావజాలం ఉండటంతో 2 దేశాల బంధం ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. కశ్మీర్ ప్రజలకు నిర్ణయాధికారం ఇవ్వాలని, అక్కడికి అంతర్జాతీయ పరిశీలకులను పంపాలంటూ ఆ పార్టీ నేత జెరెమీ 2019లో తీర్మానాన్ని ఆమోదించారు. ఆ పార్టీవి ఓటు బ్యాంక్ రాజకీయాలంటూ అప్పట్లో భారత్ తీవ్రంగా మండిపడింది.
Similar News
News November 15, 2025
సిరిసిల్ల: స్వెటర్ల దుకాణాలు వచ్చేశాయి..!

గత వారం, పది రోజులుగా చలితీవ్రత పెరుగుతూ వస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వేములవాడ, సిరిసిల్ల పట్టణాలలో కొత్తగా స్వెటర్ దుకాణాలు వెలిశాయి. నేపాల్కు చెందిన వ్యాపారులు వీటిని ఏర్పాటు చేశారు. నాణ్యమైన ఉన్నితో రూపొందించిన ఈ దుస్తులు ఎక్కువ కాలం మన్నుతాయని వారు అంటున్నారు.
News November 15, 2025
ఏరో ఇంజిన్ రాజధానిగా తెలంగాణ: శ్రీధర్ బాబు

TG: ఏరో ఇంజిన్ రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలదే కీలక పాత్ర అని చెప్పారు. ఇప్పటికే 25కు పైగా ‘A&D’ సంస్థలు, 1500కు పైగా MSMEలు ‘TG బ్రాండ్’ను విస్తరించాయని చెప్పారు. ₹800 CRతో JSW డిఫెన్స్ ‘UAV మాన్యుఫ్యాక్చరింగ్ UNIT’, ₹500 CRతో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ డిఫెన్స్ ఫెసిలిటీ వస్తున్నాయన్నారు.
News November 15, 2025
తిప్పేస్తున్న జడేజా.. 6 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్సులో RSA 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 4 వికెట్లతో సత్తా చాటారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 45 పరుగుల లీడ్లో ఉంది. ఇవాళ మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉంది.


