News March 6, 2025
‘ఎమ్మెల్సీ’ తీర్పుతో ప్రజావ్యతిరేకత అర్థమైంది: కిషన్ రెడ్డి

TG: సమష్టి కృషితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ నెరవేర్చలేదని, అందుకే ఆయనను ఎవరూ పట్టించుకోవట్లేదని ఎద్దేవా చేశారు. పాలకులు మారినా పాలన మారలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పుతో ప్రజావ్యతిరేకత అర్థమైందని తెలిపారు. విద్యావంతులు బీజేపీ వైపు నిలిచారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
Similar News
News October 16, 2025
రాత్రిళ్లు పసుపు కలిపిన పాలు తాగుతున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచేందుకు పసుపు కలిపిన పాలు తాగడం మేలని వైద్యులు చెబుతున్నారు. ఈ పాలను నెలరోజుల పాటు రాత్రిళ్లు తీసుకుంటే ఆరోగ్యకరమని అంటున్నారు. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నిరోధిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకలు, కీళ్లను బలపరచడమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అంతేకాకుండా రాత్రి పూట ప్రశాంతమైన నిద్రకు ఉపయోగపడుతుంది.
News October 15, 2025
పొట్టి శ్రీరాములు విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైజ్’గా నామకరణం

AP: అమరావతిలో నిర్మించనున్న 58 అడుగుల ఎత్తైన అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనాలను CM చంద్రబాబు సచివాలయంలో పరిశీలించారు. విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైజ్’గా నామకరణం చేశారు. శాఖమూరులో 6.8 ఎకరాల్లో మెమోరియల్ ట్రస్ట్, స్మృతి వనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతివనంలో విగ్రహాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.
News October 15, 2025
అఫ్గాన్ ప్లేయర్లకు టాప్ ర్యాంకులు

ICC ర్యాంకింగ్స్లో అఫ్గానిస్థాన్ ప్లేయర్లు సత్తా చాటారు.
*వన్డే బౌలర్లలో రషీద్ ఖాన్కు నం.1 ర్యాంక్
*వన్డే ఆల్రౌండర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్కు నం.1 ర్యాంక్
*వన్డే బ్యాటర్లలో ఇబ్రహీం జర్దాన్కు రెండో ర్యాంక్
> మరోవైపు భారత ప్లేయర్లు కూడా ర్యాంకింగ్స్ దక్కించుకున్నారు. టెస్టు బౌలర్లలో బుమ్రా, టీ20 బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వన్డే బ్యాటర్లలో గిల్, టీ20 బ్యాటర్లలో అభిషేక్ నం.1 ర్యాంకుల్లో ఉన్నారు.