News April 12, 2024

సిక్కింలో ‘యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్’ ప్రయోగం

image

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్’‌ (ATGM)ను భారత ఆర్మీ ప్రయోగించింది. త్రిశక్తి కార్ప్స్ ఆధ్వర్యంలో సిక్కింలోని గువాహటి సమీపంలో 17 వేల అడుగుల ఎత్తైన ప్రదేశంలో ఈ క్షిపణి ప్రయోగం నిర్వహించారు. పర్వత ప్రదేశాల నుంచి ఈ మిసైల్‌ను ప్రయోగించనున్నారు. ఈ మిస్సైల్స్ ఒక సైనికుడు తీసుకెళ్లేంత చిన్నవిగా ఉంటాయి.

Similar News

News March 25, 2026

రాజమండ్రిలో పోలవరం ప్రాజెక్టు ఆఫీసు ప్రారంభం

image

AP: రాజమండ్రిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది. ఈ ఆఫీసును కేంద్ర జల శక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావు ప్రారంభించారు. తర్వాత పోలవరం పనులను పరిశీలించి, అధికారులతో ఆయన సమీక్షించారు. కాగా ఇప్పటివరకు PPA ప్రధాన ఆఫీసు హైదరాబాద్‌లో ఉండేది.

News March 25, 2026

మిచెల్ స్టార్క్‌కు DC షాక్ ఇవ్వనుందా?

image

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా IPL ఆరంభ మ్యాచులకు ఢిల్లీ స్టార్ బౌలర్ స్టార్క్ దూరం కానున్నారు. అయితే కొన్నిరోజుల్లో తన రాకపై అప్డేట్ ఇవ్వకపోతే జట్టు నుంచి తప్పించాలని యాజమాన్యం నిర్ణయించినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. స్టార్క్ స్థానంలో మరొక ప్లేయర్‌ను తీసుకోవడానికి సిద్ధమైనట్లు చెప్పాయి. AUS క్రికెట్ బోర్డు NOC ఇవ్వకపోవడంతో స్టార్క్ ఎప్పుడు జట్టులో జాయిన్ అవుతారనే దానిపై క్లారిటీ లేదు.

News March 25, 2026

ఇందిరపై కామెంట్స్.. సభలో బీజేపీ Vs కాంగ్రెస్

image

TG: ఇందిరపై రాకేశ్ రెడ్డి <<19474706>>కామెంట్స్<<>> సభలో BJP-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఆమెపై అలాంటి వ్యాఖ్యలు హరీశ్ రావు సహా ఎవరు చేసినా సరికాదని మంత్రి శ్రీధర్ బాబు అనడంతో BRS MLA సంజయ్, BJP MLAలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి అడ్డుపడ్డారు. దీంతో వారిని కూర్చోండంటూ మంత్రి ఆగ్రహించారు. ఇక రాకేశ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదని ఏలేటి అన్నారు.