News February 25, 2025
చంద్రబాబు ఇంటిపై దాడి కేసు నిందితులకు ముందస్తు బెయిల్

AP: YCP హయాంలో చంద్రబాబు ఇల్లు, TDP ఆఫీసుపై జరిగిన దాడి కేసుల్లో నిందితులకు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీంతో దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సహా 20 మందికి ఊరట దక్కింది. అయితే విచారణకు సహకరించాలని, దేశం వదిలి వెళ్లొద్దని ఆదేశించింది. విచారణను 3 ఏళ్లు తాత్సారం చేశారని వ్యాఖ్యానించింది. నిందితులకు తాము తప్పు చేశామని తెలుసని, అధికారం పోయాక కోర్టుకు వచ్చారని ప్రభుత్వం వాదనలు వినిపించింది.
Similar News
News October 26, 2025
దుక్కి సమస్య నేలల్లో బాగా మొలక రావాలంటే?

మాగాణిలో వరి తర్వాత ఆరుతడి పంటలకు అనువుగా దుక్కి చేయడం ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇక్కడ వరి తర్వాత ఆరుతడి పంటలు వేయడానికి భూమిని దున్నగానే పెళ్లలు పెద్దవిగా లేస్తాయి. అందువల్ల వేసిన పంట సరిగా మొలకెత్తదు. ఇలాంటి సమస్య ఉన్న భూముల్లో మొదట మాములుగా నాగళ్లతో దున్నిన తర్వాత ట్రాక్టరుతో నడిచే రోటవేటర్ (లేదా) పళ్లదంతెతో దున్నితే పెద్ద పెళ్లలు పగిలి అనువైన దుక్కి వస్తుంది.
News October 26, 2025
రాష్ట్రంలో 225 పోస్టులు.. అప్లై చేశారా?

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(TGCAB) 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష , సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.750, SC/ST/PWBDలకు రూ.250. వెబ్సైట్:
https://tgcab.bank.in
News October 26, 2025
జమ్మి చెట్టును ఎందుకు పూజించాలి?

శమీ వృక్షాన్ని సకల దేవతల నివాసంగా భావిస్తారు. దసరా రోజున ఈ చెట్టు ఆకులను బంగారంగా భావించి ఇతరులకు పంచుతారు. ఇది శుభాలను, ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. పాండవులు విజయాన్ని సాధించినట్టే, ముఖ్య కార్యాలకు, ముఖ్యమైన ప్రయాణాలకు వెళ్లే ముందు శమీ వృక్షాన్ని దర్శించుకోవడం మంచిదని పండితులు సూచిస్తుంటారు. ఈ వృక్షాన్ని పూజించడం వల్ల ఆ కార్యాలు విజయవంతమవుతాయని, అడ్డంకులు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం.


