News September 19, 2025
ANU: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షా షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున విద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల చేసినట్లు దూరవిద్య కేంద్రం పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ తెలిపారు. ఈనెల 21వ తేదీ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 10 పరీక్ష కేంద్రాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు.
Similar News
News September 19, 2025
యారాడ కొండపై కనకదుర్గమ్మ.. ప్రత్యేక బోటు ఏర్పాటు

యారాడ కొండపై వేంచేసి ఉన్న శ్రీసాగర్ గిరి కనక దుర్గ అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 22 నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు ఈఉత్సవాలు జరగనున్నాయి. పోర్టు వెంకటేశ్వరస్వామి ఆలయ జెట్టీ నుంచి యారాడకు ప్రత్యేక బోట్ సౌకర్యం కల్పిస్తారు. గత ఏడాది టికెట్ ధర రూ.40గా ఉంది. గాజువాక, సింధియా మీదుగా రోడ్డు మార్గంలో కూడా ఆలయానికి చేరుకోవచ్చు.
News September 19, 2025
కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగం

ఇటీవల అనారోగ్య కారణాలతో మృతిచెందిన ఒక హోంగార్డు కుటుంబాని జిల్లా పోలీసుశాఖ అండగా నిలిచింది. విధి నిర్వహణలో ఉంటూ హోంగార్డు దాసరి మునిస్వామి అనారోగ్యంతో మార్చి 25న మృతి చెందాడు. ఈయన కుమారుడు దాసరి పెద్ద స్వామికి ఎస్పీ విక్రాంత్ పాటిల్ కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగం ఇస్తూ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. శుక్రవారం సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేశ్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు.
News September 19, 2025
జూ.ఎన్టీఆర్ ఎలా గాయపడ్డారంటే?

ఓ ప్రైవేట్ యాడ్ షూట్ చేస్తుండగా జూ.ఎన్టీఆర్ <<17762493>>గాయపడ్డ<<>> విషయం తెలిసిందే. సెట్లో చీకటి ఉండటంతో స్టేజీ ఎడ్జ్ నుంచి ఆయన జారి కిందపడ్డట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో తారక్ పక్కటెముకలు, చేతికి స్వల్పగాయాలైనట్లు పేర్కొన్నాయి. ఎన్టీఆర్ను పరీక్షించిన వైద్యులు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. చికిత్స అనంతరం తారక్ ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.