News August 21, 2025

ANU: పీజీ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్ 2025లో నిర్వహించిన M.SC. ఫారెస్ట్రీ 4వ, ఇంటిగ్రేటెడ్ M.A. పబ్లిక్ పాలసీ సెకండియర్ 4వ, M.B.A.(మీడియా మేనేజ్‌మెంట్) 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.

Similar News

News April 5, 2026

గుంటూరులో ఓపెన్ డ్రింకింగ్‌.. 179 మందిపై కేసులు

image

గుంటూరు జిల్లాలో బహిరంగ మద్యం తాగే వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. SP వకుల్ జిందాల్ ఆదేశాలతో నిన్న సాయంత్రం 5:30 నుంచి 9గంటల వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 178 కేసులు నమోదు చేసి, 179 మందిపై చర్యలు తీసుకున్నారు. ఇందులో 8 FIR కేసులు, 170 పెట్టి కేసులు ఉన్నాయి. ప్రధాన రహదారులు, కాలనీలు, గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు చట్టాలను పాటించాలని పోలీసులు సూచించారు.

News April 5, 2026

యువ అధికారుల పాలనలో గుంటూరు జిల్లా..!

image

గుంటూరు జిల్లాలో పాలన బాధ్యతలు యువ ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ, జేసీ ఆశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ మయూర్ అశోక్ బాధ్యతలు చేపట్టారు. గతంలో సమన్వయం లోపంతో పురోగతి మందగించిందని భావించిన ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు సమాచారం. వీరు భూ వివాదాలు, రేషన్ అక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. నగరంలో డ్రెయినేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు అవసరమని ప్రజలు ఆశిస్తున్నారు.

News April 4, 2026

18వ స్థానంలో గుంటూరు జిల్లా

image

ఫిబ్రవరి 2026కు సంబంధించిన పీహెచ్‌సీ పనితీరు ర్యాంకింగ్స్‌లో గుంటూరు జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 24 పీహెచ్‌సీలలో 1 A గ్రేడ్, 13 B, 8 C, 2 D గ్రేడ్‌లు సాధించాయి. మొత్తం 120 మార్కుల్లో 85 మార్కులు పొందింది. వెనుకబడిన ప్రాంతాల్లో సేవల మెరుగుదల అవసరం ఉన్నప్పటికీ, మొత్తం ఆరోగ్య సేవల నాణ్యత క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు.