News November 18, 2025

ANU: మాస్టారూ… ఇదేం క్వశ్చన్ పేపర్? నివ్వెరపోయిన స్టూడెంట్స్!

image

నాగార్జున వర్సిటీ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం మళ్లీ బయటపడింది. ఇవాళ జరిగిన MSC 3rd సెమిస్టర్‌ పరీక్షలో నమూనా పత్రాలనే అసలు ప్రశ్నాపత్రాలుగా పంపిణీ చేయడంతో విద్యార్థులు నివ్వెరపోయారు. చేతితో రాసిన ప్రశ్నలను ప్రింట్ చేసి ఇవ్వడం, సూచనలు-నియమావళి లేకపోవడం ఆశ్చర్యపోయేలా చేసింది. మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. కాగా గతంలో పేపర్ లీకేజీకి కారణమైన వ్యక్తే.. ఇందుకు కారణమని సమాచారం.

Similar News

News November 18, 2025

సికింద్రాబాద్ MRO ఆఫీసులో ఏసీబీ సోదాలు

image

సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా సర్వేయర్ కిరణ్ పట్టుబడ్డాడు. ఎమ్మార్వో కార్యాలయంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సర్వేయర్ కిరణ్‌తో పాటు చిన్న మెన్ భాస్కర్లను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News November 18, 2025

సాంఘిక దురాచారాలపై పోరాటం అవసరం: చిన్నారెడ్డి

image

శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న ఈ ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్ష కొనసాగడం బాధాకరమని సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జి జి. చిన్నారెడ్డి అన్నారు. సాంఘిక దురాచారాలపై ప్రతి ఒక్కరూ సంఘటితంగా పోరాడాల్సిన బాధ్యత ఉందన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో సీఎం ప్రజావాణి, దళిత స్త్రీ శక్తి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారెడ్డి మాట్లాడారు.

News November 18, 2025

వైద్య అధికారులకు పల్నాడు కలెక్టర్ ఆదేశాలు

image

ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు సంబంధించిన అన్ని బకాయిలను 15 రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట ఏరియా ఆసుపత్రుల వైద్య అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో ఉన్న సౌకర్యాల స్థాయిని, నిధుల ఉత్పత్తిని కలెక్టర్ సమీక్షించారు.