News October 1, 2024
రోడ్డు మధ్యలో దర్గా, గుడి, గురుద్వారా ఏదైనా కూల్చాల్సిందే: సుప్రీంకోర్టు

బుల్డోజర్ యాక్షన్పై తమ వ్యాఖ్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘మనది సెక్యులర్ కంట్రీ. పబ్లిక్ రోడ్, ఫుట్పాత్, వాటర్ బాడీ, రైల్వే లైన్లో ఆక్రమణలు అన్నిటికీ మా ఆదేశాలు వర్తిస్తాయి. రోడ్డు మధ్యలో గుడి, గురుద్వారా, దర్గా సహా ఎలాంటి మతపరమైన కట్టడాలున్నా కూల్చేయాల్సిందే. అనధికార నిర్మాణాలకు ఒకటే చట్టం. వాటికి మతాలతో సంబంధం లేదు’ అని వివరించింది.
Similar News
News February 26, 2026
భారత్ నేరుగా సెమీస్ చేరాలంటే..

T20WC: నేడు వెస్టిండీస్పై సౌతాఫ్రికా గెలిస్తే 4 పాయింట్లతో ఆ జట్టు సెమీస్లోకి అడుగుపెడుతుంది. అదే సమయంలో INDకు కొంత మేలు జరుగుతుంది. భారత్.. జింబాబ్వే, వెస్టిండీస్లను ఓడిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం కూడా నేరుగా సెమీస్కు వెళ్తాం. ఒకవేళ ఇవాళ WI గెలిస్తే సౌతాఫ్రికా జింబాబ్వే చేతిలో ఓడిపోవాలి. దాంతోపాటు మనం భారీ తేడాతో జింబాబ్వే, WIపై గెలిచి విండీస్ NRRను దాటాల్సి ఉంటుంది.
News February 26, 2026
ట్రంప్కు మరో ఎదురుదెబ్బ

టారిఫ్ల విషయంలో <<19195677>>ఎదురుదెబ్బ<<>> తిన్న US అధ్యక్షుడు ట్రంప్కు మరో షాక్ తగిలింది. అక్రమ వలసదారులను వారి దేశాలకు కాకుండా ఇతర దేశాలకు తరలించడాన్ని ఫెడరల్ కోర్టు తప్పుపట్టింది. వారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం సరికాదని, చట్టబద్ధత కూడా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడానికి అవకాశమిచ్చింది.
News February 26, 2026
తీర్థం ఎందుకు తీసుకోవాలి?

తీర్థం తీసుకోవడం వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య కారణాలున్నాయి. తీర్థం సకల పాపాలను హరించి, అకాల మరణం కలగకుండా కాపాడుతుందని నమ్మకం. పూజలో ఉంచే తీర్థం రోగనిరోధక శక్తిని పెంచి, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఇది మంత్రోక్తమైన దైవ శక్తిని కలిగి ఉంటుందని పండితులు మాట. ‘తీర్థం తీసుకుంటే మనసు ప్రశాంతమవుతుంది. ఆత్మశుద్ధి కలుగుతుంది. ఏ గుడికి వెళ్లినా తీర్థం తప్పక తీసుకోవాలి’ అంటున్నారు.


