News October 22, 2024
AOI కాన్ఫరెన్స్లో గాంధీ ENT డాక్టర్లకు పథకాల పంట

శామీర్ పేటలో 3 రోజులు జరిగిన సౌత్ ఇండియా, తెలంగాణ స్థాయి AOI కాన్పరెన్స్లో గాంధీ మెడికల్ కాలేజీ ENT డాక్టర్లు పతకాలను గెలుచుకున్నారు. ENT డిపార్ట్మెంట్ HOD ప్రొ.జే.భూపేందర్ రాథోడ్ 2 కేటగిరిల్లో 2 గోల్డ్ మెడల్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.రేవతి, డా.సౌజన్య, డా.లోచన, డా.శిల్ప, డా.రమణి మానసలను గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఇందిర అభినందించారు.
Similar News
News November 12, 2025
HYD: గాంధీ విగ్రహాల సేకరణ ప్రచార రథం ప్రారంభం

గాంధీభవన్లో గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాపన స్వర్ణోత్సవాల సందర్భంగా చేపట్టిన ‘ఒక అడుగు- లక్ష గాంధీజీ విగ్రహాలు’ కార్యక్రమానికి ప్రచార రథాన్ని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన గాంధీజీ విగ్రహం ప్రతిష్ఠాపనకు పూనుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
News November 12, 2025
HYD: డ్రగ్ కేసులో నైజీరియన్ డిపోర్టేషన్

హైదరాబాద్ H-NEW పోలీసులు డ్రగ్ కేసులో నైజీరియన్ ఒన్యేవుకూ కెలెచి విక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా భారత్లో ఉండి డ్రగ్ సరఫరాలో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. FRRO సహకారంతో అతడిని డిపార్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నైజీరియన్స్ అనుమానాస్పదంగా కనబడితే తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
News November 12, 2025
FLASH: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈరోజు అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడు సలీంను (DRI) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతడి బ్యాగులో 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, సలీంను అదుపులోకి తీసుకున్న అధికారులు, నిషేధిత వస్తువులను సీజ్ చేశారు.


