News October 22, 2024

AOI కాన్ఫరెన్స్‌లో గాంధీ ENT డాక్టర్లకు పథకాల పంట

image

శామీర్​ పేటలో 3 రోజులు జరిగిన సౌత్​ ఇండియా, తెలంగాణ స్థాయి AOI కాన్పరెన్స్​‌లో గాంధీ మెడికల్​ కాలేజీ ENT డాక్టర్లు పతకాలను గెలుచుకున్నారు. ENT డిపార్ట్​‌మెంట్ HOD ప్రొ.జే.భూపేందర్​ రాథోడ్​ 2 కేటగిరిల్లో 2 గోల్డ్​ మెడల్స్​, అసిస్టెంట్​ ప్రొఫెసర్ డా.రేవతి, డా.సౌజన్య, డా.లోచన, డా.శిల్ప, డా.రమణి మానసలను గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్​ ఇందిర అభినందించారు.

Similar News

News November 26, 2025

ట్యాంక్‌బండ్ వద్ద ఆందోళన.. ట్రాఫిక్ జామ్

image

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన GO 46ను రద్దు చేసి బీసీలకు 42% రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ నాయకులు ట్యాంక్‌బండ్‌పై ఆందోళన చేపట్టారు. రిజర్వేషన్లలో భాగంగా కొన్ని మండలాల్లో బీసీలకు పంచాయతీలు రిజర్వ్ కాలేదన్నారు. రాస్తారోకో చేపట్టడంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి తరలించారు.

News November 26, 2025

HYD: LOVEలో ఫెయిల్.. ఇన్ఫోసిస్‌ ఉద్యోగి సూసైడ్

image

ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన కుర్ర పవన్ కళ్యాణ్ రెడ్డి (26) స్నేహితులతో కలిసి సింగపూర్ టౌన్షిప్‌లో అద్దెకుంటూ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. లవ్ ఫెయిల్ అయిందన్న బాధలో పవన్ తన రూమ్‌లో ఉరేసుకున్నాడు. స్నేహితులు గమనించి PSకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు వర్మ తెలిపారు.

News November 26, 2025

HYD: వెంటాడుతున్న విషసర్పాలు!

image

హైదరాబాద్ శివారు ఏరియాలను విషసర్పాలు వెంటాడుతున్నాయి. ఘట్‌కేసర్, ప్రతాపసింగారంలో రక్తపింజర, కొండచిలువలు ప్రత్యక్ష్యమైన ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా మొయినాబాద్‌లోనూ ఇదే భయం పట్టుకుంది. మొన్న మండల ఆఫీస్ సమీపంలో ఒక పామును స్థానికులు పట్టుకున్నారు. వరుస ఘటనలతో ప్రజలు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రజల ప్రాణ రక్షణతో పాటు వన్య ప్రాణులనూ కాపాడాలని కోరుతున్నారు.