News April 16, 2025
AP ప్రభుత్వ సలహాదారుగా దమ్మపేట వాసి నియామకం

కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన రిటైర్డ్ IFS ఉద్యోగి పసుమర్తి మల్లిఖార్జునరావును ఏపీ కూటమి ప్రభుత్వ సలహాదారు(అటవీ అభివృద్ధి కార్యకలాపాలు)గా నియమిస్తూ ఏపీ సీఎస్ వజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి నియమించారు. ఈయన పదవీకాలం రెండేళ్లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో మండల వాసులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Similar News
News November 14, 2025
రాష్ట్రంలో మరో 2 ఉపఎన్నికలు.. జోరుగా చర్చ

TG: ఫిరాయింపు MLAలపై స్పీకర్ విచారణ కొనసాగుతుండడం తెలిసిందే. వీరిలో దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(ఘన్పూర్) అఫిడవిట్లూ ఇవ్వలేదు. పార్టీ మారినట్లు కడియం చెప్పగా దానం ఏకంగా CONG అభ్యర్థిగా SEC MP ఎన్నికల్లో పోటీచేశారు. తాజాగా WBలో TMCలో చేరిన BJP MLAపై వేటుపడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై వేటు తప్పదని, ఈ 2చోట్ల ఉపఎన్నిక రావొచ్చనే చర్చ మొదలైంది. ఈ 2 స్థానాల్లోనూ గెలుస్తామని CONG చెబుతోంది.
News November 14, 2025
పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలి: కలెక్టర్

ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమలు ఏర్పాటుకు అందించిన దరఖాస్తులను సంబంధిత శాఖలు నిర్దేశిత సమయంలో అనుమతులు జారీ చేయాలన్నారు.
News November 14, 2025
టీయూ: ఎంఏ/ ఎంకామ్/ ఎమ్మెస్సీ పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ యూనివర్సిటీలో ఎంఎ/ ఎంకామ్/ ఎమ్మెస్సీ నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు ఆదేశాల మేరకు టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి, కంట్రోలర్ ప్రొఫెసర్ కే.సంపత్ కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కంట్రోలర్, డాక్టర్ నందిని, డాక్టర్ శాంతాబాయి డాక్టర్ తోకల సంపత్ తదితరులు పాల్గొన్నారు.


