News April 16, 2025
AP ప్రభుత్వ సలహాదారుగా దమ్మపేట వాసి నియామకం

కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన రిటైర్డ్ IFS ఉద్యోగి పసుమర్తి మల్లిఖార్జునరావును ఏపీ కూటమి ప్రభుత్వ సలహాదారు(అటవీ అభివృద్ధి కార్యకలాపాలు)గా నియమిస్తూ ఏపీ సీఎస్ వజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి నియమించారు. ఈయన పదవీకాలం రెండేళ్లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో మండల వాసులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Similar News
News December 21, 2025
రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు.. త్వరలో జాబ్ క్యాలెండర్!

AP: త్వరలోనే నిరుద్యోగ యువతకు శుభవార్త రానుంది. కూటమి ప్రభుత్వం జనవరిలో <<18617902>>జాబ్ క్యాలెండర్<<>> విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అన్ని శాఖల వారీగా ఖాళీల వివరాలను సేకరిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, విద్యా శాఖలలోనే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. మరో వారంలో ఖాళీల తుది లెక్క తేలనుంది.
News December 21, 2025
MHBD: యూరియా కావాలా.. ఇలా చేయండి!

MHBD జిల్లాలో యూరియా బస్తాల కోసం రైతులు Fertilizer Booking App డౌన్ లోడ్ చేసుకోవాలని పెద్దముప్పారం క్లస్టర్ AEO ఉదయ్ కిరణ్ తెలిపారు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, రైతు తన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ చేయాల్సి ఉంటుందన్నారు. తదనంతరం, యూరియా స్టాక్ అందుబాటులో ఉన్న షాపు ఎంచుకొని, బుక్ చేసుకోవాలని, 24 గంటల్లోపు తెచ్చుకోవాలని సూచించారు.ఈ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
News December 21, 2025
ములుగు: ఇసుక లారీల ‘చక్రబంధం’.. నరకప్రాయంగా ప్రయాణం

ములుగు జిల్లా ధర్మారం-చేరుకురు మధ్య ఇసుక లారీల కారణంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. శనివారం ఉదయం నుంచే వందలాది వాహనాలు రోడ్డుపై బారులు తీరడంతో ఉద్యోగులు, ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ లారీల వల్ల రహదారి గుంతలమయంగా మారి ప్రమాదాలకు నిలయమైంది. స్థానిక మెయిన్ రోడ్డు అధ్వానంగా తయారవ్వడంతో కనీసం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


