News April 16, 2025

AP ప్రభుత్వ సలహాదారుగా దమ్మపేట వాసి నియామకం

image

కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన రిటైర్డ్ IFS ఉద్యోగి పసుమర్తి మల్లిఖార్జునరావును ఏపీ కూటమి ప్రభుత్వ సలహాదారు(అటవీ అభివృద్ధి కార్యకలాపాలు)గా నియమిస్తూ ఏపీ సీఎస్ వజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి నియమించారు. ఈయన పదవీకాలం రెండేళ్లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో మండల వాసులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Similar News

News December 25, 2025

బాపట్ల జిల్లా: మెప్మాలో భారీగా అవినీతి..!

image

బాపట్ల జిల్లాలో MEPMA నకిలీ రుణాల బాగోతం గురువారం బట్టబయలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.70 కోట్ల మేర అక్రమాలు జరగ్గా, అందులో బాపట్ల జిల్లా పరిధిలో భారీగా నిధులు దారిమళ్లినట్లు తేలింది. బాపట్ల, కర్లపాలెం, రేపల్లె ప్రాంతాల్లో రూ.6 కోట్ల మేర నకిలీ రుణాలు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇటీవల CMకి పల్నాడు కలెక్టర్ వివరాలు వెల్లడించారు.

News December 25, 2025

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మందు బాబులకు అలర్ట్

image

TG: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మందు కొట్టి విచ్చలవిడిగా రోడ్లపై వాహనాలతో తిరిగే వారిపై పోలీసులు చర్యలకు దిగుతున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10వేల జరిమానాతో పాటు వెహికల్ సీజ్, గరిష్ఠంగా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాల్లో 304 వాహనాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు.
Share it

News December 25, 2025

వ్యాధుల ముప్పు కోళ్లలో తగ్గాలంటే?

image

ఏదైనా కోడిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మిగిలిన కోళ్ల నుంచి దాన్ని వేరుచేయాలి. వ్యాధితో ఏదైనా కోడి చనిపోతే దాన్ని దూరంగా లోతైన గుంతలో పూడ్చిపెట్టాలి లేదా కాల్చేయాలి. కోళ్ల షెడ్డులోకి వెళ్లేవారు నిపుణులు సూచించిన క్రిమిసంహారక ద్రావణంలో కాళ్లు కడుక్కున్న తర్వాతే వెళ్లాలి. కోడికి మేతపెట్టే తొట్టెలు, నీటితొట్టెలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్డులో లిట్టరును గమనిస్తూ అవసరమైతే మారుస్తుండాలి.