News October 21, 2025
ఆక్వా ఎగుమతుల్లో 60% వాటా ఏపీదే: లోకేశ్

AP: ప్రపంచ కొనుగోలుదారులతో రాష్ట్ర ఆక్వా ఎగుమతిదారుల అనుసంధానానికి ట్రేడ్ మిషన్, నెట్వర్కింగ్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ సీఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా(SAI)ను కోరారు. కోల్డ్చైన్ మేనేజ్మెంటు, ప్యాకేజింగ్ రంగాల్లో ఆధునిక పరిజ్ఞానం, స్థిరమైన మత్స్యసంపద నిర్వహణకు నైపుణ్యాలు అందించాలన్నారు. ఇండియాలో ఆక్వా ఎగుమతుల్లో ఏపీ వాటా 60% పైగా ఉందని, 2024-25లో ₹66వేల కోట్ల ఎగుమతులు చేసిందని చెప్పారు.
Similar News
News October 21, 2025
తరింపజేసే పంచమహామంత్రాలు

మనః అంటే మనసు, త్ర అంటే రక్షించేది. మనసును రక్షించేదే మంత్రం. ఇది దైవస్వరూపం. మంత్రం ఉచ్చరించినపుడు అందులో నాదబలం మనసును శాంతపరచి, ఆత్మను ఉన్నతస్థితికి తీసుకెళ్తుంది. పంచమహామంత్రాలివే..
1.ఓంనమఃశివాయ- పంచాక్షరీమంత్రం 2.ఓం నమో నారాయణాయ-అష్టాక్షరీమంత్రం 3.ఓం నమో భగవతే వాసుదేవాయ-ద్వాదశాక్షరీ మంత్రం, 4.ఓంభూర్భువఃస్వహ-గాయత్రీ మంత్రం, 5.ఓంత్రయంబకం యజామహే-మహామృత్యుంజయ మంత్రం.
News October 21, 2025
మహిళలు రోజుకొక ఆరెంజ్ తింటే..

ఆరెంజ్లలో ఉండే విటమిన్-C కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి. రోజుకొక ఆరెంజ్ తింటే ఒత్తిడి 20% తగ్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గర్భిణులకు అవసరమైన ఫోలేట్ వంటి పోషకాలను అందిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది.
News October 21, 2025
BMW కార్లకు లోక్పాల్ ఆర్డర్.. తీవ్ర విమర్శలు

దేశంలో అవినీతి నిర్మూలనకు ఏర్పడిన లోక్పాల్ వివాదంలో చిక్కుకుంది. 7 BMW-3 సిరీస్ కార్ల కొనుగోలుకు సిద్ధమవడమే ఇందుకు కారణం. ఒక్కో కారు విలువ రూ.70 లక్షలు కాగా వీటి కోసం పబ్లిక్ టెండర్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ‘మోదీ ప్రభుత్వం లోక్పాల్ను భూస్థాపితం చేసి ఇటీవల తమ సేవకులను నియమించింది. ఇప్పుడు వారి జల్సాల కోసం ఏం చేసినా పట్టించుకోవట్లేదు’ అని సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ విమర్శించారు.