News November 27, 2024
మారిటైమ్ హబ్గా ఏపీ: చంద్రబాబు

AP: సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాన్ని మారిటైమ్ హబ్గా తీర్చిదిద్దాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మారిటైమ్ పాలసీపై ఆయన చర్చించారు. ‘తీరప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆర్థిక వృద్ధి సాధించొచ్చు. హై కెపాసిటీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలి. క్రూయిజ్ టెర్మినల్స్, ఫ్లో టెల్స్ ఉపయోగించాలి. నాన్ మేజర్, గ్రీన్ ఫీల్డ్, నోటిఫై చేసిన పోర్టులను తీర్చిదిద్దాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
ఉద్యోగుల పనితీరుపై కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ కన్ను

IT సంస్థలు హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులతో పనిచేయిస్తున్నాయి. అయితే వారి పనితీరు తెలుసుకొనేలా ‘Cognizant’ ‘ప్రో-హాన్స్ స్టైల్’ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టింది. ఇది మౌస్ను ట్రాక్ చేస్తుంటుంది. 300 సెకండ్లు కదలకపోతే ఐడల్గా, 15 ని.లు మించితే దూరంగా ఉన్నట్లు తెలుపుతుంది. వాడే అప్లికేషన్లనూ గుర్తిస్తుంది. కాగా ఇది సిబ్బంది పనితీరును అంచనా వేయడానికి కాదని, వినియోగం తెలుసుకొనేందుకేనని కంపెనీ చెబుతోంది.
News November 18, 2025
ఉద్యోగుల పనితీరుపై కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ కన్ను

IT సంస్థలు హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులతో పనిచేయిస్తున్నాయి. అయితే వారి పనితీరు తెలుసుకొనేలా ‘Cognizant’ ‘ప్రో-హాన్స్ స్టైల్’ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టింది. ఇది మౌస్ను ట్రాక్ చేస్తుంటుంది. 300 సెకండ్లు కదలకపోతే ఐడల్గా, 15 ని.లు మించితే దూరంగా ఉన్నట్లు తెలుపుతుంది. వాడే అప్లికేషన్లనూ గుర్తిస్తుంది. కాగా ఇది సిబ్బంది పనితీరును అంచనా వేయడానికి కాదని, వినియోగం తెలుసుకొనేందుకేనని కంపెనీ చెబుతోంది.
News November 18, 2025
CNG సరఫరా నిలిచి ముంబైలో స్తంభించిన రవాణా

ముంబైలో 2 రోజులుగా CNG సరఫరా నిలిచి ప్రైవేట్, పబ్లిక్ రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పైప్ లైన్లో సమస్యతో నగరంలోని 486 రీఫిల్లింగ్ స్టేషన్లలో ఆదివారం నుంచి గ్యాస్ సరఫరా నిలిచింది. CNGతో నడిచే ఆటోలు, కార్లు, బస్సులు తిరగక అవస్థలు తప్పలేదు. సోమవారం నాటికి కొంతమేర సరఫరా చేపట్టారు. నేటి మధ్యాహ్నానికి కానీ పూర్తి సరఫరా కాదని కంపెనీలు పేర్కొన్నాయి. కాగా ముంబైలో CNGతో నడిచే కార్లే 5 లక్షల వరకు ఉన్నాయి.


