News July 23, 2024
కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పలు కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుతో పాటు YSR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును సైతం వైసీపీ ప్రభుత్వం YSR హెల్త్ యూనివర్సిటీగా మార్చింది.
Similar News
News April 3, 2026
మద్యం ధరలు పెరగనున్నాయా?

పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత్లో మద్యం ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయం, ముడి పదార్థాల ధరల పెరుగుదల&కొరతతో గాజు బాటిళ్ల తయారీ వ్యయం 15-20% పెరిగింది. వీటికి తోడు షిప్పింగ్, అల్యూమినియం ధరలూ పెరగడంతో 10-15% ధరలు పెంచే యోచనలో కంపెనీలు ఉన్నాయి. బీర్లతో పాటు అన్ని రకాల మద్యం ధరలు పెంచాలని బ్రూవరీస్ ప్రతిపాదించాయి. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.
News April 3, 2026
GK: భారత విమానయాన పితామహుడు ఎవరు?

⋆ అతిపెద్ద విమానాశ్రయం: రాజీవ్ గాంధీ (శంషాబాద్, సుమారు 5,500 ఎకరాలు)
⋆ భారత విమానయాన పితామహుడు- JRD టాటా
⋆ తొలి విమాన ప్రయాణం: 1911, FEB 18 (అలహాబాద్-నైనీ)
⋆ తొలి విమానయాన సంస్థ: టాటా ఎయిర్లైన్స్
⋆ తొలి ఉమెన్ పైలట్: సరళా థక్రాల్
⋆ పౌర విమానయానాన్ని నియంత్రించే సంస్థ: డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)
⋆ ఎయిర్ పోర్టుల నిర్వహణను చూసే సంస్థ: ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)
News April 3, 2026
రేపటి నుంచి రబీ కొనుగోళ్లు.. 8 గంటల్లోనే ఖాతాల్లో డబ్బు: నాదెండ్ల

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ‘1,917 కేంద్రాల ద్వారా 23 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యం. రైతుల కోసం 5.40 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచాం. 17,262 వాహనాలు అందుబాటులో ఉంటాయి. ధాన్యం కొనుగోలు చేసిన 8 గంటల్లోపే అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం’ అని SMలో పోస్టు చేశారు.


