News February 27, 2025
రేపే AP బడ్జెట్.. కీలక పథకాలకు కేటాయింపులు

AP: అసెంబ్లీలో రేపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ₹3L Crతో పద్దు ఉండొచ్చని అంచనా. ఉ.9గంటలకు CM CBN అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. దీన్ని శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల, మండలిలో కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ను అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు ఉండనున్నాయి.
Similar News
News December 18, 2025
‘PPP’ తప్పనుకుంటే నన్ను జైలుకు పంపు జగన్: సత్యకుమార్

AP: PPP మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం పట్ల జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ‘PPPలో అభివృద్ధికి త్వరలో 4 కాలేజీలను భాగస్వాములకిస్తాం. ఇది తప్పయితే వైద్య శాఖ మంత్రినైన నన్ను జైలుకు పంపే చర్యలు తీసుకోవచ్చు’ అని సవాల్ విసిరారు. PPPని కేంద్రం, నీతి ఆయోగ్, కోర్టులు సమర్థించాయని, అందుకని PM మోదీ సహా అందరినీ జైలుకు పంపిస్తావా? అని నిప్పులు చెరిగారు.
News December 18, 2025
చలి ఎఫెక్ట్.. స్కూళ్ల టైమింగ్స్ మార్పు

TG: చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఆదిలాబాద్(D) కలెక్టర్ స్కూల్ టైమింగ్స్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఉ.9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు ఉన్న టైమింగ్స్ను ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటలకు మార్చారు. అటు ఇతర జిల్లాల్లోనూ టైమింగ్స్ మార్చాలని పేరెంట్స్ కోరుతున్నారు.
News December 18, 2025
ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. రేపు కేంద్రమంత్రులతో భేటీ

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అమిత్ షా, నిర్మల, గడ్కరీ, సీఆర్ పాటిల్, హర్దీప్ సింగ్, సర్బానందలతో భేటీ అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై వారితో చర్చించి వినతి పత్రాలు అందజేస్తారు. రాత్రికి తిరిగి APకి చేరుకునే అవకాశం ఉంది. ఎల్లుండి అనకాపల్లిలో పర్యటించి మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.


