News August 6, 2025

AP క్యాబినెట్ భేటీ నిర్ణయాలు

image

*40 వేల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
*భవానీ ఐల్యాండ్, అరకులో మరిన్ని సౌకర్యాలు
*వైష్ణవి ఇన్‌ఫ్రాకు 25 ఎకరాల TTD భూమి కేటాయింపునకు అంగీకారం
*ఫార్చ్యూన్-500 లిస్టులోని IT సంస్థలకు తక్కువ ధరకే భూములు
* భూములు పొందిన ఐటీ సంస్థలైతే 3 వేలు, GCCల్లోనైతే 2 వేల ఉద్యోగాలు కల్పించాలి
*రూ.900 కోట్ల APBDCL రుణాలకు ప్రభుత్వ హామీకి అంగీకారం
*ప్రభుత్వ సంస్థలకు తక్కువ ధరలకే భూముల కేటాయింపు

Similar News

News August 7, 2025

GOOD NEWS.. వారికి రూ.25,000

image

AP: చేనేత కార్మికుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి DBV స్వామి చెప్పారు. నేతన్న భరోసా కింద త్వరలోనే వారికి రూ.25,000 ఇస్తామని ప్రకటించారు. అందమైన వస్త్రాలు నేసి సమాజానికి నేతన్నలు నాగరికత నేర్పించారని ప్రశంసించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేటి నుంచి చేతి మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించే పథకం ప్రారంభిస్తున్నామన్నారు.

News August 7, 2025

ఈ ‘స్వామి’ ఆకలి కేకలను దూరం చేశాడు

image

భారత రత్న, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ MS స్వామినాథన్ 3 పదుల వయసులోనే దేశ భవిష్యత్ మార్చారు. కరవుతో అల్లాడుతున్న ప్రజలకు కాంతిరేఖలా మారారు. జపాన్, US, మెక్సికో శాస్త్రవేత్తలతో కలిసి వరి, గోధుమ వంగడాలపై ఆయన చేసిన పరిశోధనలు ఆకలి కేకలను దూరం చేశాయి. ఆ తర్వాత భారత్ వెనుతిరిగి చూడలేదు. విదేశాలకు ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం.

News August 7, 2025

రేషన్ లబ్ధిదారులకు నిరాశ

image

AP: రేషన్ షాపుల్లో కందిపప్పు ఈ నెల కూడా పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. కొంతకాలంగా సరఫరా నిలిచిపోగా, పండుగల సీజన్ కావడంతో ఈసారి ఇస్తారని అంతా భావించారు. షాపులకు వెళ్లాక అసలు విషయం తెలిసి అసంతృప్తి చెందుతున్నారు. కొన్నిచోట్ల అరకొరగా పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో KG ₹120 ఉండటంతో రేషన్ షాపుల్లో పంపిణీ చేయాలని కోరుతున్నారు. మీకు కందిపప్పు అందిందా? కామెంట్ చేయండి.