News July 30, 2024

2న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు భేటీ ప్రారంభమవుతుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, వాలంటీర్ వ్యవస్థ, భూఅక్రమాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Similar News

News April 6, 2026

లాకప్ డెత్ కేసు.. తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష

image

తమిళనాడులో 2020లో జరిగిన తండ్రి-కుమారుల లాకప్ డెత్ కేసుపై మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష విధించింది. లాక్‌డౌన్‌లో 2020 జూన్ 19న జయరాజ్, ఆయన కుమారుడు జే బెన్నిక్స్‌ను పోలీసులు లాకప్‌లో వేశారు. విచారణ పేరుతో హింసించడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. అనుమతించిన దాని కంటే ఎక్కువ సమయం మొబైల్ షాప్ నడిపారని వీరిని అరెస్ట్ చేయగా ఆ ఆరోపణల్లో నిజం లేదని తేలింది.

News April 6, 2026

వాట్సాప్ యూజర్లకు శుభవార్త

image

జర్నీస్, ఔట్ డోర్స్‌లో వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు నాయిస్‌తో ఇబ్బంది పడుతున్నారా? అలాంటి వారికి వాట్సాప్ శుభవార్త చెప్పింది. రియల్ టైమ్‌లో బ్యాక్ గ్రౌండ్ నాయిస్‌ను తొలగించి, వాయిస్ క్వాలిటీని పెంచే ఫీచర్‌ను డెవలప్ చేసింది. దీన్ని ప్రస్తుతం కొందరు Beta యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే అందరికీ 2.26.14.1 వెర్షన్‌ అప్డేట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

News April 6, 2026

KKR vs PBKS మ్యాచ్‌కు వర్షం ముప్పు!

image

IPL: కాసేపట్లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే KKR, PBKS మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. రాత్రి 8 గంటలకు వర్షం పడే ఛాన్స్ 90% ఉందని, దీంతో మ్యాచ్‌కు అంతరాయం కలగొచ్చని వెదర్‌ రిపోర్ట్ చెబుతోంది. అదే జరిగితే మ్యాచ్ రద్దయ్యి ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. అయితే ప్రస్తుతానికి అక్కడ వాతావరణం పొడిగా ఉన్నట్లు సమాచారం. కాగా గత ఏడాది ఈడెన్‌లో జరిగిన KKR-PBKS మ్యాచ్‌ వర్షం కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.