News October 23, 2024
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్తపై పన్ను రద్దు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త రేషన్ కార్డులు, రేషన్ డీలర్ల నియామకం, వాలంటీర్ల సర్వీసు కొనసాగింపుపై చర్చించే అవకాశముంది. 13కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ, ఆలయాల్లో పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ ప్రతిపాదనలపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
Similar News
News October 23, 2024
ఒంటరితనం యమా డేంజర్
ఒంటరితనంతో ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది బాధపడుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్న యువత సైతం దీని బారిన పడుతున్నారు. అయితే ఇలా సామాజిక సంబంధాలు సరిగా లేక అసంతృప్తితో బతికేవారు డిమెన్షియా బారిన పడే అవకాశం 30% పెరిగిందని పరిశోధనలో తేలింది. 6 లక్షల మందిపై జరిపిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. డిమెన్షియాతో వ్యక్తి ఆలోచనలు, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకోవడం వంటివి ప్రభావితం అవుతాయని తెలిపారు.
News October 23, 2024
చలి మొదలైంది..
తెలుగు రాష్ట్రాల్లో చలి మొదలైంది. తెల్లవారుజామున, లేట్ నైట్స్ చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఉన్ని దుస్తులు ధరించి చలి నుంచి రక్షణ పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల జ్వరాల బారినపడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు తుఫాన్ ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక మధ్యాహ్నం సమయంలో ఎండ దంచుతోంది. దీంతో భిన్నమైన వాతావరణం ఉంటోంది.
News October 23, 2024
రైతుల సమస్యలపై ఎల్లుండి నుంచి ఆందోళనలు
TG: అన్నదాతల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఈ నెల 25 నుంచి 31 వరకు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆందోళనలకు పిలుపునిచ్చింది. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని, అన్ని రకాల పంటలకు ₹500 బోనస్ చెల్లించాలని, 58 ఏళ్లు దాటిన ప్రతి రైతు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి ₹10వేల పెన్షన్ ఇవ్వాలని కోరింది. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో జరిగే ఆందోళనల్లో రైతన్నలు పాల్గొనాలని పిలుపునిచ్చింది.