News July 25, 2024
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. పోలవరం డయాఫ్రం వాల్పై తీర్మానం!

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణంపై తీర్మానం చేయనున్నట్లు సమాచారం. దీనితో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశముంది. పోలవరం డయాఫ్రం వాల్కు సంబంధించి క్యాబినెట్ తీర్మానం కావాలని కేంద్రం కోరడంతో నేడు అత్యవసరంగా మంత్రివర్గ భేటీ నిర్వహిస్తున్నారు.
Similar News
News January 30, 2026
సల్మాన్-ఐశ్వర్యా రాయ్ లవ్ స్టోరీపై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ ఓల్డ్ రిలేషన్షిప్పై నిర్మాత శైలేంద్ర సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిదీ ‘రోమియో-జూలియట్’ తరహాలో ఎమోషనల్, ‘వయలెంట్ లవ్ స్టోరీ’ అని పేర్కొన్నారు. ఐశ్వర్య గౌరవప్రదమైన, తెలివైన వ్యక్తి అని, సల్మాన్ చాలా ప్యాషనేట్ అని తెలిపారు. సల్మాన్ కంటే ముందు ఆమెకు మోడల్ రాజీవ్ మూల్చందనీతో మాత్రమే రిలేషన్ ఉండేదని.. ఇండస్ట్రీలో మరెవరితోనూ లేదని చెప్పారు.
News January 30, 2026
వెనిజులాతో ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ: మోదీ

<<18951392>>వెనిజులా<<>> తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్తో ప్రధాని మోదీ తొలిసారి మాట్లాడారు. రానున్న సంవత్సరాల్లో ఇరు దేశాల సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అంగీకారం కుదిరినట్లు ఆయన ట్వీట్ చేశారు. అన్నిరంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి కృషి చేస్తామని తెలిపారు. బలమైన దౌత్యం, విజన్తో ఇరు దేశాలకు కొత్త అవకాశాలు లభిస్తాయని రోడ్రిగ్జ్ చెప్పారు.
News January 30, 2026
ఫామ్హౌస్లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!

TG: హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. ఫిబ్రవరి 1న 3PMకు విచారణకు సిద్ధంగా ఉండాలని అందులో పేర్కొన్నారు. ఫామ్హౌస్లో విచారణ చేసేందుకు <<19005122>>నిరాకరించడానికి<<>> గల కారణాలను వివరించారు. తమ రికార్డుల్లో నందినగర్ అడ్రస్సే ఉందని తెలిపారు. విచారణను రికార్డు చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను, రికార్డులను ఫామ్హౌస్కు తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు.


