News May 21, 2024

ఏపీ మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు: కాగ్

image

APలో 2023-24కుగాను రూ.23,589 కోట్లు మూల ధన వ్యయం(ఆస్తుల కల్పన) చేసినట్లు కాగ్ ప్రైమరీ అకౌంట్స్‌లో వెల్లడించింది. గత ఐదేళ్లలో ఈ ఖర్చు రూ.87,972 కోట్లని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల వేతనాలకు రూ.52,010 కోట్లు, పెన్షన్లకు రూ.21,694 కోట్లు, సామాజిక రంగానికి(విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, SC, ST సంక్షేమం) రూ.1,10,375 కోట్లు, సాధారణ సేవలకు రూ.67,281 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.

Similar News

News September 13, 2025

రెండో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ ఎస్తర్?

image

హీరోయిన్ ఎస్తర్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెల్ల రంగు గౌను ధరించి ఆమె SMలో ఓ పోస్ట్ చేశారు. ‘జీవితంలో మరో అందమైన సంవత్సరాన్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ఈ పుట్టినరోజున నాపై ప్రేమ, ఆశీర్వాదాలు కురిపిస్తున్న మీ అందరికీ స్పెషల్ థాంక్స్. త్వరలోనే ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేస్తా’ అంటూ రాసుకొచ్చారు. కాగా సింగర్ నోయల్, ఎస్తర్ 2019లో లవ్ మ్యారేజ్ చేసుకుని, 6 నెలల్లోపే విడిపోయారు.

News September 13, 2025

భోగాపురం దాదాపు పూర్తయినట్లే: కేంద్ర మంత్రి రామ్మోహన్

image

AP: భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు 86 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వర్షాలు కురుస్తున్నా GMR సంస్థ పనులు ఆపడం లేదన్నారు. విజయనగరంలో విమానాశ్రయ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ‘వచ్చే ఏప్రిల్‌లోగా వైజాగ్ నుంచి రోడ్డు కనెక్టివిటీ పనులు పూర్తి చేస్తాం. ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మించేందుకు కసరత్తులు చేస్తున్నాం. బీచ్ కారిడార్ కోసం ఇప్పటికే DPR సిద్ధం చేశాం’ అని వివరించారు.

News September 13, 2025

షూటింగ్‌లు చేసేందుకు కాదు మీకు ఓటేసింది: పవన్‌పై రోజా ఫైర్

image

AP: రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను Dy.CM పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా ప్యాకేజీలు తీసుకుంటూ కాలం గడిపేస్తున్నారని YCP నేత రోజా విమర్శించారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు పవన్ మద్దతివ్వడం దారుణమన్నారు. ‘ఆయనకు ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. Dy.CM స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ ప్రభుత్వ ధనం వృథా చేస్తున్నారు. షూటింగ్‌లు చేసుకునేందుకు కాదు ప్రజలు ఆయనకు ఓట్లేసింది’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు.