News August 23, 2025

క్వాంటం వ్యాలీకి ఏపీ కేరాఫ్ అడ్రస్: CM CBN

image

AP: దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్‌ వ్యాలీని JANలో రాష్ట్రంలో ఆవిష్కరిస్తున్నామని CM CBN తెలిపారు. క్వాంటం వ్యాలీకి రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరంలో చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే IND నం.1 కావాలని, మనదేశానికి ఆ సత్తా ఉందన్నారు. HYDలో IT అభివృద్ధి కోసం హైటెక్‌సిటీ నిర్మించామని, అమరావతిలో AI టెక్నాలజీతో క్వాంటం వ్యాలీ సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

Similar News

News August 23, 2025

కేంద్ర మంత్రి కుమారుడిని ముద్దాడిన చంద్రబాబు

image

AP: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులకు జన్మించిన కుమారుడిని సీఎం చంద్రబాబు ముద్దాడారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సీఎం రామ్మోహన్ ఇంటికి వెళ్లి ఆ చిన్నారికి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ తండ్రి ఎర్రన్నాయుడితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అనంతరం వారి బాగోగులు తెలుసుకున్నారు.

News August 23, 2025

ఫైనల్‌కు దూసుకెళ్లిన తుంగభద్ర వారియర్స్

image

APL క్వాలిఫయర్-2లో భీమవరం బుల్స్‌పై తుంగభద్ర వారియర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు నేరుగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇవాళ వైజాగ్‌లో జరిగే ఫైనల్లో అమరావతి రాయల్స్‌తో తలపడనుంది. తొలుత భీమవరం ఓవర్లన్నీ ఆడి 183/5 పరుగులు చేసింది. తోట శ్రవణ్ (71*) రాణించారు. అనంతరం 19 ఓవర్లలోనే 5 వికెట్ల కోల్పోయి తుంగభద్ర లక్ష్యాన్ని ఛేదించింది. గుట్ట రోహిత్ (87) విధ్వంసం సృష్టించారు.

News August 23, 2025

సురవరం మృతిపై CM రేవంత్, KCR దిగ్భ్రాంతి

image

TG: కమ్యూనిస్ట్ అగ్ర నేత <<17489686>>సురవరం సుధాకర్ రెడ్డి<<>> మృతిపై సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురవరం మృతి యావత్ దేశానికే తీరని లోటు అని పేర్కొన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం, కోమటిరెడ్డి, రాజనర్సింహ, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు.