News November 15, 2024
‘టెంపుల్ టూరిజం’ బలాన్ని AP గుర్తించడం లేదా?

మన దేశానికున్న అతిపెద్ద బలం టెంపుల్ టూరిజం. కాశీ, అయోధ్య, ప్రయాగ వల్ల UPకి ఆదాయం బాగా పెరిగింది. హోటల్ సహా అనేక అనుబంధ రంగాలు రాణిస్తున్నాయి. తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, ఒంటిమిట్ట, శ్రీశైలం, విజయవాడ, ద్రాక్షారామం, అన్నవరం, అరసవెల్లి, సింహాచలం, ఆంధ్రమహా విష్ణు వంటి ఆలయాలు AP సొంతం. వీటిపై మరింత ఫోకస్ పెట్టి టెంపుల్ టూరిజాన్ని పెంచితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయం. మీరేమంటారు?
Similar News
News September 18, 2025
తల్లిపాలు ఎలా మాన్పించాలంటే..!

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యం. కానీ వయసు పెరుగుతున్నా కొందరు పిల్లలు పాలు మానరు. దీనికోసం ఒకేసారి మాన్పించకుండా పాలు ఇచ్చే వ్యవధి తగ్గింస్తుండాలి. లేదంటే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లలకు కడుపునిండా ఆహారాన్ని ఇవ్వాలి. ఏడాది తర్వాత నుంచి ఘన పదార్థాలు అలవాటు చెయ్యాలి. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఇవ్వడం, పాలు అడిగినప్పుడు వారిని డైవర్ట్ చేయడం వల్ల నెమ్మదిగా మానేస్తారు.
News September 18, 2025
Maturity Laws: ఇవి పాటించు గురూ!

* అందరికీ ప్రతీది చెప్పడం మానేయండి. ఎందుకంటే చాలా మంది వాటిని పట్టించుకోరు. బలహీనతలను అస్సలు చెప్పొద్దు
* స్నేహితులను తెలివిగా ఎంచుకోండి. సరైన స్నేహితులే మీ ఎదుగుదలను ప్రోత్సహిస్తారు
* ఏమీ ఆశించకండి. అభినందించడం నేర్చుకోండి
* మీ వంతు కృషి చేయండి. ఫలితమేదైనా స్వీకరించండి.
* ఇతరులను కాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడంపై దృష్టి పెట్టండి.
* పరిస్థితులకు తగ్గట్లు స్పందించడం అలవాటు చేసుకోండి.
News September 18, 2025
ఇద్దరు MBBS విద్యార్థుల ఆత్మహత్య

AP: విశాఖ గీతం మెడికల్ కాలేజీలో హిమాచల్ ప్రదేశ్కు చెందిన MBBS ఫస్ట్ ఇయర్ విద్యార్థి విస్మాద్ సింగ్ (20) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నిన్న కాలేజీ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్నాడు. ‘ఈ లోకంలో నేను బతకలేను. నాకు మరో జన్మ వద్దు’ అని రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు MBBS ఫస్టియర్లో ఫెయిలైన విశాఖ NRI కాలేజీ స్టూడెంట్ జ్యోత్స్న ఆత్మహత్య చేసుకుంది.