News May 11, 2024

ఏపీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే?

image

APలోని 25 పార్లమెంట్ స్థానాలకు 454 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా విశాఖ లోక్‌సభ బరిలో 33 మంది పోటీలో ఉండగా.. అత్యల్పంగా రాజమండ్రి లోక్‌సభ స్థానంలో 12 మంది పోటీ చేస్తున్నారు. ఇక 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీ చేస్తుండగా.. అత్యధికంగా తిరుపతిలో 46 మంది, అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు పోటీ చేస్తున్నారు. 4.14 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని EVMలలో ఎల్లుండి నిక్షిప్తం చేయనున్నారు.

Similar News

News January 28, 2026

హిమపాతం.. ధర్మశాల స్టేడియం ఇలా మారింది!

image

మంచు కురవడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియం వెండి కొండలా మెరిసిపోతోంది. చుట్టూ ఉన్న ధౌలాధర్ పర్వత శ్రేణులతో పాటు పరిసర ప్రాంతాలనూ మంచు దుప్పటి కప్పేసింది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఈ స్టేడియం ప్రపంచంలోనే సుందరమైన మైదానాల్లో ఒకటిగా పేరుగాంచింది. SMలో వైరలవుతున్న అందమైన ఈ ఫొటోలను చూసి ప్రకృతి ప్రేమికులు ఫిదా అవుతున్నారు.

News January 28, 2026

ICET షెడ్యూల్ విడుదల

image

TG: MBA, MCA కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ICET-2026 షెడ్యూల్ విడుదలైంది.
*ఫిబ్రవరి 6న నోటిఫికేషన్
*ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
*మార్చి 16- దరఖాస్తులకు చివరి తేదీ
*మే 13, 14న కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్
**అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.550, ఇతర అన్ని విభాగాల వారికి రూ.750. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులూ అప్లై చేసుకోవచ్చు.

News January 28, 2026

నేను పార్టీ మారినట్లు BRS భావిస్తోంది: దానం

image

TG: తాను BRSకు రాజీనామా చేయలేదని, అలాగే తనను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. ‘2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లా. వ్యక్తిగత హోదాలోనే ఆ మీటింగ్‌కు హాజరయ్యా. నేను పార్టీ మారినట్లు BRS భావిస్తోంది’ అని తెలిపారు. మరోవైపు తనపై వేసిన అనర్హత పిటిషన్‌పై ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌ను ఆయన కోరారు.