News May 11, 2024

ఏపీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే?

image

APలోని 25 పార్లమెంట్ స్థానాలకు 454 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా విశాఖ లోక్‌సభ బరిలో 33 మంది పోటీలో ఉండగా.. అత్యల్పంగా రాజమండ్రి లోక్‌సభ స్థానంలో 12 మంది పోటీ చేస్తున్నారు. ఇక 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీ చేస్తుండగా.. అత్యధికంగా తిరుపతిలో 46 మంది, అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు పోటీ చేస్తున్నారు. 4.14 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని EVMలలో ఎల్లుండి నిక్షిప్తం చేయనున్నారు.

Similar News

News December 7, 2025

రైతులకు అలర్ట్.. పంటల బీమా చెల్లించారా?

image

AP: PM ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లింపులపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. రబీకి సంబంధించి DEC 15లోపు టమాటా, వేరుశనగ, 31లోపు వరి సాగు చేసే రైతులు ప్రీమియం కట్టాలి. మామిడి రైతులకు JAN 3వరకు గడువుంది. భూమిపత్రం, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్, కామన్ సర్వీస్ ఇన్యూరెన్స్ పోర్టల్‌లో బీమా కట్టొచ్చు. పంట రుణాలున్న రైతులు నేరుగా బ్యాంకుల్లోనే ప్రీమియం చెల్లించొచ్చు.

News December 7, 2025

ఈ మంత్రం శని దోషాన్ని తగ్గిస్తుంది

image

సూర్యపుత్రో దీర్ఘదేహః విశాలక్ష శ్శివప్రియ:|
మందచార: ప్రసన్నాత్మా పీడాం దహతు మే శని:||
శన్యారిష్టే తు సంప్రాప్తే శనిపూజాంచ కారయేత్|
శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోపశాంతయే||
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం|
చాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం||
నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే|
నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయచ నమోస్తుతే||

News December 7, 2025

ఊరు విడిచినా ఉలవఅడుగు విడువరాదు

image

ఒక వ్యక్తి తాను పుట్టి పెరిగిన ఊరిని వదిలి వెళ్లినా, అక్కడ ఉండే అనుబంధాలను, తన మూలాలను, వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. తన సొంత మూలాలను, సంస్కృతిని, తన వ్యక్తిగత గుర్తింపును గౌరవించాలి, కాపాడుకోవాలి. అవే మన ప్రవర్తనను మరియు జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. ఈ సామెత మనిషి జీవితంలో సొంత ఊరు, మూలాల ప్రాముఖ్యతను, అవి ఇచ్చే విలువల గురించి తెలియజేస్తుంది.