News July 1, 2024
ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి 7వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చు.
✒ ఈ నెల 4 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
✒ 8 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక
✒ 13న ఆప్షన్ల మార్పునకు అవకాశం
✒ 16న సీట్ల కేటాయింపు
✒ 17 నుంచి 22 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్
✒ 19 నుంచి తరగతులు ప్రారంభం
Similar News
News April 14, 2026
కోర్టుల్లో బెంచ్ల గురించి తెలుసా?

సుప్రీంకోర్టులో డివిజన్ బెంచ్, కాన్స్టిట్యూషన్ బెంచ్, లార్జర్ బెంచ్, త్రీ జడ్జి బెంచ్లు ఉంటాయి. డివిజన్ బెంచ్లో ఇద్దరు న్యాయమూర్తులు ఉంటారు. స్పెషల్ లీవ్ పిటిషన్లు, సివిల్, క్రిమినల్ అప్పీళ్లను విచారిస్తారు. కాన్స్టిట్యూషన్ బెంచ్లో కనీసం ఐదుగురు జడ్జిలు ఉంటారు. ఇది శాశ్వతం కాదు. కేసు తీవ్రతను బట్టి CJI ఏర్పాటు చేస్తారు. హైకోర్టుల్లో సింగిల్, డివిజన్, ఫుల్, లార్జర్ బెంచ్లు ఉంటాయి.
News April 14, 2026
T20 కెప్టెన్గా సూర్య కొనసాగుతారా?

భారత T20 కెప్టెన్గా సూర్య ఎప్పటివరకు కొనసాగుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆయన కెప్టెన్సీలోనే భారత్ T20 WC గెలిచింది. కానీ బ్యాటింగ్లో ఆయన తడబడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్, జులైలో ENG, IREతో జరిగే T20 సిరీస్లలో ఆయన ఎలా ఆడతారనే దానిపైనే ఫ్యూచర్ ఆధారపడి ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సిరీస్లలో రాణిస్తే ఆయన 2028 ఒలింపిక్స్ వరకూ కెప్టెన్గా కొనసాగే అవకాశముందని అంటున్నారు.
News April 14, 2026
కిడ్నీ వ్యాధిని ముందే పసిగట్టేలా పరీక్షలు: మంత్రి

AP: ఉద్ధానం వాసులను పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధిని ముందే పసిగట్టి ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘‘బయోమార్కర్స్’ ద్వారా జన్యు, రక్త, మూత్ర పరీక్షలను ప్రత్యేక బృందాలతో నిర్వహిస్తున్నాం. ఇందుకు ICMR ₹6.2CR ఇచ్చింది. వ్యాధి వచ్చే అవకాశాలను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటున్నాం. పలాస రీసెర్చ్ కేంద్రం సహా విశాఖ KGHలో ప్రత్యేక ల్యాబ్లు నెలకొల్పాం’ అని తెలిపారు.


