News June 16, 2024
పోలవరం పనులపై ‘AP FACT CHECK’

AP: 2019కి ముందు పోలవరంలో 72% పనులు జరిగితే 2019-24 మధ్య 4 శాతమే జరిగాయని ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ‘2019కి ముందు రూ.11,537కోట్లు ఖర్చు చేస్తే 2019-24 మధ్య రూ.5వేల కోట్లు ఖర్చు చేశారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. కాఫర్ డ్యాం, గ్యాప్-1 ప్రధాన డ్యాంలో ఇబ్బందులు వచ్చాయి. గైడ్బండ్ కుంగిపోయింది. కొత్తగా ఎలాంటి DPR ఆమోదం పొందలేదు. నిర్వాసితులకు పునరావాస కేంద్రాలు కూడా నిర్మించలేదు’ అని వివరించింది.
Similar News
News March 5, 2026
ఇవాళ, రేపూ భారీ నష్టాలు తప్పవా?

ఇరాన్ వార్తో భారత స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. చివరి 3 సెషన్లలో ఏకంగా రూ.21.29 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత శనివారం యుద్ధం ప్రారంభం కాగా మరుసటి రోజు ఆదివారం, 3న(మంగళవారం-హోలీ) మార్కెట్లకు సెలవులు కావడంతో మరింత భారీ నష్టం తప్పింది. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతుండటం, ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇవాళ, రేపటి సెషన్లపై ‘బేర్’ పంజా తప్పేలా లేదు.
News March 5, 2026
డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో ఉద్యోగాలు

<
News March 5, 2026
ఇరాన్పై దాడులు.. US కాంగ్రెస్లో ట్రంప్కు ఊరట

ఇరాన్పై దాడులతో రాజకీయంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఆ దేశ కాంగ్రెస్లో ఊరట లభించింది. ఈ సైనిక చర్యలపై ట్రంప్ అధికారాన్ని పరిమితం చేయాలన్న తీర్మానాన్ని US సెనేట్ (ఉన్నత సభ) తిరస్కరించింది. ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ నుంచి ఒకరు, ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ నుంచి మరొకరు ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఓటింగ్లో స్వల్ప తేడాతో (53-47) రిజెక్ట్ అయింది.


