News June 15, 2024
YCP ట్వీట్పై AP FACT CHECK

జగన్ ప్రభుత్వం నిర్వహించిన స్పందన పోర్టల్ని కొత్త ప్రభుత్వం పేరు మార్చాలని నిర్ణయం తీసుకుందని వైసీపీ చేసిన ట్వీట్పై ఏపీ ఫ్యాక్ట్చెక్ వివరణ ఇచ్చింది. ‘‘ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికై అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి 2015లో ‘పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం’ ను ప్రవేశ పెట్టారు. YCP ట్వీట్ అవాస్తవం’ అని పేర్కొంది.
Similar News
News October 18, 2025
యమ దీపం ఎలా పెట్టాలంటే..?

ధన త్రయోదశి నాడు వెలిగించే యమ దీపంలో నాలుగు వత్తులు, నాలుగు ముఖాలుగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ‘ఈ దీపం కోసం.. నువ్వుల నూనె/ ఆవ నూనెను ఉపయోగించాలి. దీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో ఉంచాలి. కుటుంబ సభ్యులందరూ దీర్ఘాయుష్షుతో, కష్టాల నుంచి విముక్తి పొందాలని యమధర్మరాజును ప్రార్థించాలి. ఈ దీపదానం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నిలిచి, అకాల మరణ భయం తొలగిపోతుంది’ అని అంటున్నారు.
News October 18, 2025
BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

తెలంగాణలో బీసీల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లతో రాజ్యమేలుతారనుకుంటే బంద్తో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం హడావిడిగా బిల్లు రూపొందించడం, దాన్ని గవర్నర్ పెండింగ్లో పెట్టడం, హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే విధించడంతో తమ ‘నోటికాడ ముద్ద’ లాగేసుకున్నారని బీసీలు మండిపడుతున్నారు. ఇంతకీ ఈ పరిణామానికి కారణమెవరు? Comment
News October 18, 2025
అత్యంత భారీగా తగ్గిన వెండి ధరలు

ధన త్రయోదశి వేళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండిపై ఏకంగా రూ.13వేలు తగ్గి రూ.1,90,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,910 తగ్గి రూ.1,30,860గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 పతనమై రూ.1,19,950కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలున్నాయి.