News January 10, 2025
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ఏపీలో జగనన్న కాలనీల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్గా పేరు మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులతో ప్రజలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.
Similar News
News November 15, 2025
రైలులో బైక్& కార్ పార్సిల్ చేయాలా?

రైలులో తక్కువ ధరకే వస్తువులను <
News November 15, 2025
BREAKING: అల్పపీడనం.. భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించినట్లు తెలిపింది. ‘దీని ప్రభావంతో తీరం వెంట 35-55Kmph వేగంతో గాలులు వీస్తాయి. సోమవారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ప్రకాశం, కడప జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు’ అని సూచించింది.
News November 15, 2025
గ్యాస్లైటింగ్ గురించి తెలుసా?

మానసిక వేధింపుల్లో ‘గ్యాస్లైటింగ్’ ఒకటి. దీన్ని అనుసరించే వారు ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వారితో స్నేహం చేస్తూనే వారిని తప్పుదోవ పట్టిస్తుంటారు. ఈ క్రమంలో తమపై తమకు నమ్మకం పోయేలా, తమ నిర్ణయాలపై తమకే అనుమానం వచ్చేలా చేస్తుంటారు. మానసికంగా బలహీనంగా ఉండే వారితో ఇలా ప్రవర్తిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఎదుటి వారిని క్రమంగా బలహీనుల్ని చేసి తమ అధీనంలోకి తెచ్చుకోవడమే వీరి లక్ష్యం.


