News March 23, 2024
ఏపీ గవర్నర్కు అస్వస్థత
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది ఆయనను విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన అనారోగ్యానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Similar News
News October 2, 2024
‘ఆగడు’కి ముందు అనుకున్న కథ అది కాదు: శ్రీను వైట్ల
మహేశ్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో దూకుడు వంటి హిట్ తర్వాత వచ్చిన ‘ఆగడు’ ఫ్యాన్స్ను నిరాశపరిచింది. అయితే తాను వాస్తవంగా ఆ సినిమాకు అనుకున్న కథ వేరే అని శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆగడుకి ముందు మహేశ్కు వేరే స్టోరీ అనుకున్నాం. మహేశ్కూ నచ్చింది. కానీ బడ్జెట్ పరిమితుల దృష్ట్యా పల్లెటూరిలో జరిగే సింపుల్ కథను ఎంచుకుని సినిమాగా తీశాం. నేను ఇప్పటికీ బాధపడే నిర్ణయం అది’ అని తెలిపారు.
News October 2, 2024
గోవిందా వివరణపై పోలీసుల అసంతృప్తి!
అనుకోకుండా తుపాకీతో <<14239558>>కాల్చుకోవడంపై<<>> బాలీవుడ్ నటుడు, శివసేన నేత గోవిందాను ముంబై పోలీసులు ప్రశ్నించారు. రివాల్వర్ను శుభ్రం చేస్తున్నప్పుడు అనుకోకుండా మిస్ ఫైర్ అయిందని ఆయన చెప్పగా ఆ వివరణతో పోలీసులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. పలు అనుమానాలు రావడంతో ఆయన కుమార్తెను సైతం విచారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 2, 2024
రేపు భారీ వర్షాలు
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నంద్యాల, కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడొచ్చని పేర్కొంది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.