News October 16, 2024

తెలంగాణలో రిపోర్టు చేసిన ఏపీ ఐఏఎస్‌లు

image

ఏపీ ఐఏఎస్‌లు సృజన, శివశంకర్ తెలంగాణ సీఎస్ శాంతికుమారికి రిపోర్ట్ చేశారు. తెలంగాణలో రిపోర్ట్ చేయాల్సిందిగా వీరిని డీవోపీటీ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ నుంచి నలుగురు ఐఏఎస్‌లు ఏపీకి వెళ్లనున్నారు. ఐపీఎస్‌లకు కేంద్ర హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో అంజనీ కుమార్, అభిలాష బిస్త్ TGలోనే కొనసాగనున్నారు.

Similar News

News October 16, 2024

ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు.. అడ్డుకోవద్దు: చంద్రబాబు

image

AP: ఉచిత ఇసుక విషయంలో కూటమి MLAలు జోక్యం చేసుకుంటే ఎవర్నీ వదలబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఇందులో తన, మన అనేవి ఉండవు. ఇసుక ఉచితంగానే తీసుకెళ్లాలి. ఎవరైనా ఎడ్ల బండి తీసుకొచ్చి ఇసుక తీసుకెళ్లవచ్చు. వారిపై కేసులు పెడితే అధికారులను సస్పెండ్ చేస్తాం. దీనిలో ఎవరి పెత్తనాన్నీ సహించం. ఎవరి ఊరిలో వాళ్లకు ఇసుక తీసుకెళ్లే స్వేచ్ఛ ఉంటుంది. ఇందులో ఎవరి పెత్తనం వద్దు’ అని ఆయన స్పష్టం చేశారు.

News October 16, 2024

ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: గడికోట శ్రీకాంత్

image

AP: ప్రతిపక్ష నేతలపై చంద్రబాబు సర్కార్ తప్పుడు కేసులు బనాయిస్తోందని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ‘కూటమి ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేదు. మద్యం షాపుల కోసం టీడీపీ MLAలు దౌర్జన్యాలు చేస్తున్నారు. కేరళ మాల్ట్ బ్రాండ్ కర్ణాటకలో రూ.90కి ఇస్తుంటే ఇక్కడ రూ.99కి పెంచారు. పథకాలేవీ అమలు చేయడం లేదు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు’ అని ఫైర్ అయ్యారు.

News October 16, 2024

‘మీకు ఓటేశా.. నాకు పెళ్లి చేయండి’.. MLAను కోరిన వ్యక్తి

image

UPలో చర్ఖారీ MLA బ్రిజ్‌భూషణ్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. పెట్రోల్ బంక్‌లో పని చేసే అఖిలేంద్ర అనే వ్యక్తి తనకు పెళ్లి చేయాలని MLAను కోరాడు. తననే ఎందుకు అడుగుతున్నావని MLA ప్రశ్నించగా.. ‘నేను మీకు ఓటేశాను’ అని ఆన్సర్ ఇచ్చాడు. తన వయసు 43 అని చెప్పాడు. కాసేపు మాట్లాడిన MLA ‘నాకు ఓటేశావు కదా. నా వంతు ప్రయత్నిస్తా. నీ జీతం ఎంత?’ అని అడిగారు. అతను రూ.6వేలు వస్తుందని, 13బిగాల భూమి ఉందని చెప్పారు.