News June 27, 2024

AP- IIITలకు ఎంతమంది అప్లై చేశారో తెలుసా?

image

AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి గత నెల 8న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 25వ తేదీకి ముగిసింది. ఈఏడాది 4,400 ప్రవేశాలకు గాను 53,863 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జులై 11న ఎంపికైన అభ్యర్థుల
జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. జులై 22, 23న నూజివీడు, ఇడుపులపాయ,
24, 25న ఒంగోలు, 26, 27న శ్రీకాకుళం IIIT అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరగనుంది.

Similar News

News October 21, 2025

కార్తీక మాసం.. జిల్లాలో ప్రముఖ శివాలయాలివే.!

image

కార్తీకమాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసంలో కడప జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
*పొలతల మల్లికార్జునస్వామి ఆలయం
*ప్రొద్దుటూరు ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం
* వీరపునాయనపల్లె సంగమేశ్వర స్వామి ఆలయం
* అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయం
* సిద్ధవటం నిత్యపూజేశ్వర స్వామి
* జమ్మలమడుగు అగస్తేశ్వరస్వామి ఆలయం
*ఖాజీపేట నాగ నాదేశ్వర కోన.
*పులివెందుల సిద్ధ లింగేశ్వర స్వామి ఆలయం.

News October 21, 2025

నేడు పోలీస్ సంస్మరణ దినోత్సవం: SP

image

విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల దినోత్సవం మంగళవారం కడపలో నిర్వహించనున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సోమవారం తెలిపారు. ఉదయం పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొననున్నట్లు చెప్పారు.

News October 20, 2025

కడప: నేడు పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు

image

దీపావళి పండుగ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా రద్దు చేస్తున్నామని అర్జీదారులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.