News January 28, 2025

పెట్టుబడులపై ఏపీ అలా.. తెలంగాణ ఇలా!

image

దావోస్‌లో ఒప్పందాలు ఉండవు, కేవలం చర్చలే ఉంటాయని.. ఆ తర్వాత కంపెనీల ఆసక్తి మేరకు ఒప్పందాలు చేసుకుంటాయని మంత్రి లోకేశ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అటు దావోస్, సింగపూర్ పర్యటనల్లో రూ.1.80లక్షల కోట్లకు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టి వివరించింది. పెట్టుబడులపై తెలుగు రాష్ట్రాలు రెండు విధాలుగా చెప్పడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై మీ COMMENT.

Similar News

News January 3, 2026

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సిట్?

image

TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం, ఖర్చు పెట్టిన నిధులపై విచారణకు సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

News January 3, 2026

ప్రముఖ నటుడికి యాక్సిడెంట్

image

ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గువాహటిలో భార్య రూపాలీతో కలిసి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే ఆశిష్ దంపతులను హాస్పిటల్‌కు తరలించారు. తనకు స్వల్ప గాయాలైనట్లు ఆయన SM ద్వారా వెల్లడించారు. తన భార్యను ఇంకా పరిశీలనలో ఉంచారని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు. ఆశిష్‌ విద్యార్థి తెలుగులో పోకిరి, చిరుత సహా అనేక సినిమాలు చేశారు.

News January 3, 2026

మంచి పశుగ్రాసానికి ఉండాల్సిన లక్షణాలు

image

పాడి పశువులకు అందిచే గ్రాసం రుచిగా, ఎక్కువ మాంసకృత్తులు కలిగి ఉండాలి. తక్కువ కాలంలో కోతకు వచ్చి ఎక్కువ దిగుబడి ఇచ్చేదిగా ఉండాలి. నీటి ఎద్దడిని తట్టుకొని ఏ దశలో కోసినా రుచికరంగా ఉండాలి. ఎలాంటి విష పదార్థాలు ఉండకూడదు. అన్ని కాలాల్లో మంచి దిగుబడిని ఇవ్వాలి. అన్ని రకాల నేలల్లో తక్కువ నీటితో సాగు చేసుకోగలినదై ఉండాలి. తెగుళ్లను తట్టుకునేలా, కోసిన తర్వాత రోజుల తరబడి నిల్వచేసుకొనుటకు వీలుగా ఉండాలి.