News January 21, 2025

టెక్నాలజీ వినియోగంలో ఏపీ నంబర్‌వన్: నారా లోకేశ్

image

AP: టెక్ వినియోగంలో ఏపీ నంబర్‌వన్ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. AIలోనే కాకుండా డీప్ టెక్‌లోనూ తాము ముందున్నామని దావోస్‌లో చెప్పారు. మరోవైపు ఇదే సదస్సులో CM చంద్రబాబు పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఎల్జీ కెమ్, సిస్కో, కార్ల్స్ బెర్గ్, మార్క్స్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు CM ట్వీట్ చేశారు. ఈ కంపెనీలన్నింటికి ఆహ్వానం పలుకుతున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 11, 2025

రుణ విముక్తి కోసం రేపు ఇలా చేయండి: పండితులు

image

రుణబాధలు తొలగిపోవాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించాలని పండితులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కనకధారా స్తోత్రం చదివి, పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే ఆర్థిక బాధలు పోతాయంటున్నారు. ‘మహిళలు స్నానం చేసే, ఇల్లు తుడిచే నీటిలో కాస్త ఉప్పు వేయాలి. ఫలితంగా దారిద్ర్యం తొలగిపోతుంది. రుణ విముక్తి కూడా కలుగుతుంది. సిరిసంపదలు వృద్ధి చెందాలంటే పూజా మందిరంలో కూర్మం(తాబేలు) ఉంచండి’ అని సూచిస్తున్నారు.

News December 11, 2025

ఆలుమగల కలహం, ఆరికకూడు వంట

image

భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్నపాటి గొడవలు, అరికల (కొర్రలు) అన్నం వండడానికి పట్టేంత తక్కువ సమయంలోనే సద్దుమణుగుతాయని ఈ సామెత చెబుతుంది. భార్యభర్తల మధ్య కలహాలు దీర్ఘకాలం ఉండవు. అవి తాత్కాలికమైనవి. త్వరగా సమసిపోతాయి. ఆ కలహాలు వారి మధ్య అనురాగాన్ని మరింత పెంచుతాయి. అలాగే కొర్రల అన్నం కూడా తక్కువ సమయంలోనే సిద్ధమై ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ సామెత అర్థం.

News December 11, 2025

పాసులుంటేనే ఎంట్రీ!

image

TG: ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ, CM రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఈ నెల 13న ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. పాసులు ఉన్నవారే మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియానికి రావాలని రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. మిగతావారిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. ఆరోజు స్టేడియం వద్ద రద్దీ లేకుండా ప్రజలు సహకరించాలని కోరారు. మెస్సీ 13, 14, 15 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు.