News January 21, 2025

టెక్నాలజీ వినియోగంలో ఏపీ నంబర్‌వన్: నారా లోకేశ్

image

AP: టెక్ వినియోగంలో ఏపీ నంబర్‌వన్ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. AIలోనే కాకుండా డీప్ టెక్‌లోనూ తాము ముందున్నామని దావోస్‌లో చెప్పారు. మరోవైపు ఇదే సదస్సులో CM చంద్రబాబు పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఎల్జీ కెమ్, సిస్కో, కార్ల్స్ బెర్గ్, మార్క్స్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు CM ట్వీట్ చేశారు. ఈ కంపెనీలన్నింటికి ఆహ్వానం పలుకుతున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 17, 2025

సంక్రాంతికి మరో 16 స్పెషల్ ట్రైన్స్

image

సంక్రాంతి పండగకు ఊరెళ్లే వారి కోసం దక్షిణమధ్య రైల్వే సర్వీసులు పెంచుతోంది. తాజాగా మరో 16 ట్రైన్స్ అనౌన్స్ చేసింది. సికింద్రాబాద్-శ్రీకాకుళం, వికారాబాద్-శ్రీకాకుళం, శ్రీకాకుళం-సికింద్రాబాద్ మార్గాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. జనవరి 9 నుంచి 18 మధ్య ఈ ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు ద.మ. రైల్వే తెలిపింది. రైళ్ల పూర్తి సమాచారం కోసం ఇమేజ్ స్లైడ్ చేయండి.

News December 17, 2025

ఆముదంతో చర్మం, గోళ్ల సంరక్షణ

image

చర్మం ముడతలు పడకుండా చేసే గుణాలు ఆముదంలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘చమురు రాసుకుని స్నానం చేస్తే చర్మం తాజాగా కనిపిస్తుంది. ఆముదంతో రోజూ 10ని. గోళ్లకు మర్దన చేసుకుంటే అవి దృఢంగా మారి విరగకుండా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు, నిద్ర లేచాక చమురు రాసుకుంటే పెదవులు కోమలంగా ఉంటాయి’ అని చెబుతున్నారు. అయితే గర్భిణులు, పాలిచ్చే తల్లులు దీనికి దూరంగా ఉంటే మంచిందంటున్నారు.

News December 17, 2025

జనవరి 1న ‘భారత్ టాక్సీ’ ప్రారంభం

image

ప్రయాణికులకు, డ్రైవర్లకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ యాప్‌ను జనవరి 1 నుంచి ప్రారంభించనుంది. ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా దీనిని తీసుకొస్తోంది. తొలుత ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి తరువాత దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో ఇందులో అధిక ఛార్జీలు ఉండవు. ఇప్పటికే 56 వేల మందికిపైగా డ్రైవర్లు రిజిస్టర్‌ చేసుకున్నట్లు సమాచారం.