News December 11, 2024

30 మందిని కాపాడి ఏపీ జవాన్ వీరమరణం

image

AP: రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడుకు చెందిన హవల్దార్ వరికుంట్ల సుబ్బయ్య (45) 30 మంది సైనికులను కాపాడి వీరమరణం పొందారు. జమ్మూలోని ఎల్‌ఓసీ వెంట 30 మంది జవాన్లతో కలిసి సుబ్బయ్య పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ల్యాండ్ మైన్‌పై కాలు పెట్టారు. ఇది గమనించి తన తోటి సైనికులను గో బ్యాక్ అంటూ గట్టిగా అరిచారు. ఆ తర్వాత అది ఒక్కసారిగా పేలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Similar News

News October 10, 2025

WPL ఆక్షన్ తేదీలు ఖరారు?

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలం నవంబర్ 25-29 తేదీల మధ్య జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. ఒక్కో టీమ్ రూ.15కోట్ల పర్స్ కలిగి ఉంటాయని, 2025 స్క్వాడ్‌ నుంచి ఐదుగురిని రిటైన్ చేసుకోవచ్చని పేర్కొన్నాయి. నవంబర్ 5లోగా జట్ల యాజమాన్యాలు రిటెన్షన్స్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. 2023 నుంచి ఈ టోర్నీని నిర్వహిస్తుండగా ముంబై ఇండియన్స్ (2023, 25) రెండుసార్లు, RCB ఒకసారి (2024) విజేతగా నిలిచాయి.

News October 10, 2025

లేఆఫ్స్‌పై ఆ ప్రచారంలో నిజం లేదు: TCS

image

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS)లో 50,000-80,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నారన్న ప్రచారాన్ని సంస్థ CHRO సుదీప్ కన్నుమల్ ఖండించారు. అందులో నిజం లేదని తెలిపారు. మిడ్& సీనియర్ లెవెల్ ఉద్యోగుల్లో 1% (6,000) మందిని మాత్రమే తొలగించినట్లు స్పష్టం చేశారు. కాగా FY26 Q1లో ఆ సంస్థ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉండగా, FY26 Q2లో 5,93,314కి తగ్గినట్లు IT వర్కర్స్ యూనియన్ NITES స్టేట్‌మెంట్ విడుదల చేసింది.

News October 10, 2025

కాబుల్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు?

image

అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌పై పాక్ వైమానిక దాడులు జరిపినట్లు తెలుస్తోంది. కాబుల్‌లో పేలుళ్లు సంభవించినట్లు వార్తలొస్తున్నాయి. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(TTP) ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో తాను మరణించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని TTP చీఫ్ ముఫ్తీ నూర్ మెహ్సూద్ ఖండించారు. కాగా AFG ప్రభుత్వం TTP ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తోందని PAK రక్షణ మంత్రి ఇటీవల ఆరోపించారు.