News October 10, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* ఇవాళ రాత్రి లండన్ పర్యటనకు బయల్దేరనున్న మాజీ CM YS జగన్ దంపతులు
* అమ్మాయిల సమస్యల ఫిర్యాదుకు త్వరలో ఆన్లైన్ పోర్టల్ తెస్తామన్న మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ
* ఆర్పేట సీఐపై చిందులేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ విద్యాసాగర్
* చంద్రబాబు నాయకత్వంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిపోయిందన్న మాజీ మంత్రి విడదల రజనీ
Similar News
News October 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 11, 2025
అఫ్గాన్ను భారత్ టెర్రర్ బేస్గా వాడుతోంది: పాక్

భారత్-అఫ్గాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ DG అహ్మద్ షరీఫ్ ఇండియాపై దారుణమైన ఆరోపణలు చేశారు. ‘పాక్లో టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కోసం అఫ్గాన్ను భారత్ ఒక ఉగ్రవాద స్థావరంగా వాడుకుంటోంది. అఫ్గాన్లో ఇతరులకు చోటివ్వడం కేవలం పాక్కే కాదు.. సౌదీ, UAE, చైనా, US, తుర్కియే దేశాలకూ ప్రమాదమే’ అని షరీఫ్ వ్యాఖ్యానించినట్లు ‘ది డాన్’ నివేదికలో పేర్కొంది.
News October 11, 2025
చైనాకు ట్రంప్ మరోసారి హెచ్చరికలు

అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించడంతో చైనాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి ప్రతిచర్యగా చైనా ఉత్పత్తులపై మరోసారి భారీగా సుంకాలు తప్పవని హెచ్చరించారు. చైనాతో స్నేహంగా ఉంటున్నా తాజా చర్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ తరుణంలో జిన్పింగ్తో భేటీకి కారణం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. మరో 2 వారాల్లో సౌత్ కొరియా పర్యటన సందర్భంగా జిన్ పింగ్తో ట్రంప్ భేటీ కావాల్సి ఉంది.