News August 24, 2025

AP న్యూస్ రౌండప్

image

*తిరుపతి తారకరామా స్టేడియంలో ప్రారంభమైన రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడలు-2025
*అక్టోబర్ 2నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ తొలగిస్తాం: నారాయణ
*నిడదవోలులో 59 మందికి రూ.29.72 లక్షల విలువైన CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేశ్
*YCP పునాదులను బలపరచడంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు కీలకపాత్ర పోషించాలి: సజ్జల
*శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి 3,80,380 క్యూసెక్కుల నీటి విడుదల

Similar News

News August 25, 2025

ఇవాళ అందుబాటులోకి DSC కాల్ లెటర్లు

image

AP: DSCకి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన కాల్‌లెటర్లు నేటి నుంచి అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. తొలుత ఈరోజు నుంచే వెరిఫికేషన్ చేపట్టాలని భావించినా, సాంకేతిక ఇబ్బందుల కారణంగా కాల్ లెటర్ల జారీ ఆలస్యంతో వాయిదా వేసింది. మొత్తం 16,347 పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన తర్వాత తుది జాబితా సిద్ధం చేసి పోస్టింగ్‌ ఇస్తారు.

News August 25, 2025

నేడు ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. వర్సిటీలో కొత్తగా నిర్మించిన హాస్టళ్ల ప్రారంభోత్సవంతో పాటు పలు భవనాల నిర్మాణాలకు సంబంధించి భూమి పూజలో ఆయన పాల్గొంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం ఓయూకు వెళ్లడం ఇదే తొలిసారి. అటు వర్సిటీ భూముల సర్వే, నియామకాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఓయూ కార్యక్రమం అనంతరం ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది.

News August 25, 2025

ఈ సమయాల్లో నీరు తాగితే?

image

శరీరానికి అత్యవసరమైన వాటిలో నీరు ఒకటి. రోజుకు 3-4 లీటర్ల నీళ్లు తాగితే ఎన్నో రోగాలను ముందుగానే నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
✒ నిద్ర లేవగానే గోరు వెచ్చని నీరు తాగితే టాక్సిన్స్‌(వ్యర్థాలు)ను బయటకు పంపుతుంది. ✒ భోజనానికి ముందు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ✒ స్నానానికి ముందు నీరు తాగితే బీపీ నియంత్రణలో ఉంటుంది. ✒ నిద్రకు ముందు తాగితే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ నుంచి రక్షణ కలుగుతుంది.