News September 3, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ICET-2025 రెండో విడత కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం. ఖాళీగా 33 వేల సీట్లు.
* ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన PG ECET తొలి విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల గడువు ఈనెల 8 వరకు పొడిగింపు. వివరాలకు cets.apsche.ap.gov.in సైట్‌ను సంప్రదించండి.
* గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.

Similar News

News September 21, 2025

ఈ నెల 24న వైసీపీ కీలక సమావేశం

image

AP: వైసీపీ చీఫ్ YS జగన్ అధ్యక్షతన ఈ నెల 24న ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, సమన్వయకర్తలు హాజరు కానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

News September 21, 2025

మహిళల వన్డే క్రికెట్‌లో సరికొత్త చరిత్ర

image

నిన్నటి ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా మధ్య జరిగిన <<17776758>>వన్డే<<>> మ్యాచ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉమెన్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇరు జట్లు కలిపి అత్యధిక పరుగులు(781) చేసిన మ్యాచ్‌గా ఇది నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 412 పరుగులు చేయగా, టీమ్ ఇండియా 369 రన్స్ చేసింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లాండ్-దక్షిణాప్రికా(2017లో 678 రన్స్) పేరిట ఉండేది.

News September 21, 2025

సెప్టెంబర్ 21: చరిత్రలో ఈ రోజు

image

✒ 1862: మహాకవి గురజాడ అప్పారావు జయంతి(ఫొటో)
✒ 1931: దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు జననం
✒ 1939: రచయిత్రి రంగనాయకమ్మ జననం
✒ 1979: విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ జననం
✒ 2003: సినీ నటి కృతి శెట్టి జననం
✒ 2012: తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మరణం
✒ అంతర్జాతీయ శాంతి దినోత్సవం
✒ ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం