News April 1, 2025
ఏపీ పీజీఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్

AP: రాష్ట్రంలోని వర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 1 తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దాదాపు 153 పీజీ కోర్సులకు సంబంధించి జూన్ 6 నుంచి 8 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు https://cets.apsche.ap.gov.inలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
Similar News
News December 6, 2025
విశాఖ స్టేడియంలో ‘ఎకో ఫ్రెండ్లీ’ సెల్ఫీ పాయింట్..!

భారత్-దక్షిణాఫ్రికా వన్డే సందర్భంగా విశాఖ స్టేడియంలో ఎకో ఫ్రెండ్లీ సెల్ఫీ పాయింట్ను ACA అధ్యక్షుడు K శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు ప్రారంభించారు. ప్లాస్టిక్ రహిత విశాఖపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం అన్నారు. GVMC, స్వచ్ఛ ఆంధ్ర సహకారంతో ఏర్పాటు చేసిన ఈ పాయింట్ వద్ద ఫొటోలు దిగేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
News December 6, 2025
వేంకన్న గుడికి పట్నాలో 10.11 ఎకరాలు

పట్నాలో తిరుమల వేంకన్న గుడి నిర్మాణానికి 10.11 ఎకరాలను బిహార్ ప్రభుత్వం కేటాయించింది. ₹1 టోకెన్ రెంటుతో 99 ఏళ్ల లీజుకు ఈ భూమిని ఇచ్చింది. ఈమేరకు ఆ రాష్ట్ర CS ప్రతయ అమృత్ TTD ఛైర్మన్ బీఆర్ నాయుడికి లేఖ రాశారు. ఈ నిర్ణయంతో ఆ రాష్ట్రంలో టీటీడీ ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు అవకాశం ఏర్పడిందని నాయుడు తెలిపారు. త్వరలో ఆ రాష్ట్ర ప్రతినిధులను సంప్రదించి ఆలయ నిర్మాణానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
News December 6, 2025
ఇతిహాసాలు క్విజ్ – 88 సమాధానం

ఈరోజు ప్రశ్న: విష్ణుమూర్తిని శ్రీనివాసుడు అని ఎందుకు పిలుస్తారు?
సమాధానం: విష్ణువును శ్రీనివాసుడు అని పిలవడానికి ప్రధాన కారణం.. ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి నివాసం ఉండటమే. ‘శ్రీ’ అంటే లక్ష్మీదేవి. ‘నివాస’ అంటే నివాసం. అలా లక్ష్మీదేవికి నిలయమైన ఆయనను శ్రీనివాసుడు అని పిలుస్తారు. ఈ పేరు భగవంతుడికి ఉన్న ప్రేమపూర్వకమైన, సంరక్షణతో కూడిన స్వభావాన్ని సూచిస్తుంది.
<<-se>>#Ithihasaluquiz<<>>


