News March 24, 2024

ఏపీ పీజీఈసెట్ షెడ్యూల్ విడుదల

image

AP: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీఈసెట్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఏప్రిల్ 20లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 29, 30 తేదీల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. పూర్తి వివరాల కోసం <>https://cets.apsche.ap.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు.

Similar News

News October 14, 2025

APPLY NOW: ఇంటర్‌తో 7,565 పోస్టులు

image

ఇంటర్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. 18-25 ఏళ్ల వయసున్నవారు ఈనెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, PE&MT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు పదో తరగతి స్థాయిలో ప్రిపేర్ కావాలి. జీతం నెలకు ₹21,700, అలవెన్సులు అదనం. వెబ్‌సైట్: https://ssc.gov.in/

News October 14, 2025

మోదీ టూర్.. కర్నూలులో 10 మంది మంత్రుల మకాం!

image

AP: ప్రధాని మోదీ కర్నూలు సభ విజయవంతం చేసేందుకు, జన సమీకరణకు 10 మంది మంత్రులు అక్కడే మకాం వేశారు. 16న జరిగే సభకు 7,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. PM పర్యటించే ప్రాంతాల్లో 200 CC కెమెరాలు ఏర్పాటు చేశారు. నేటి నుంచి 16 వరకు డ్రోన్ల ఎగరవేతపై ఆయా ప్రాంతాల్లో నిషేధం విధించారు. ప్రధాని సభకు వెళ్లేవారి కోసం దాదాపు 8వేల బస్సులు సమకూరుస్తున్నట్లు సమాచారం.

News October 14, 2025

మీరు విన్న, కొన్న ది బెస్ట్ లోయెస్ట్ రేట్ ఏంటి?

image

బంగారం.. మున్ముందు ఈ పేరూ పలుకే బంగారమాయెనా అనేలా పచ్చ లోహం ధరలున్నాయి. ఇన్నాళ్లూ 24క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.1 లక్ష పైన కొనసాగగా ఇప్పుడు పన్నులతో కలిపి 18 క్యారెట్లూ ఒక లకారం దాటుతోంది. ఇప్పుడు సామాన్యుడు గోల్డ్ గురించి మాట్లాడుకోవడమే కానీ టైమ్ ట్రావెల్‌లో ధర తక్కువ ఉన్న గోల్డెన్ డేస్‌కు వెళ్లి కొనలేడు. మీరు ఎంత తక్కువ రేటుకు స్వర్ణం కొన్నారు. లేదా మీ వాళ్లు చెబుతుంటే విన్నారు? కామెంట్ చేయండి.