News January 31, 2025
మహా కుంభమేళాకు ఏపీ ప్రత్యేక బస్సులు

AP: UPలో జరుగుతున్న మహా కుంభమేళా కోసం పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా 2 బస్సుల్ని ఏర్పాటు చేయనుంది. వచ్చే నెల 11న తిరుపతి నుంచి, 12న నెల్లూరు నుంచి ఈ బస్సులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఆ వివరాల ప్రకారం.. తిరుపతి బస్సు కడప, కర్నూలు, హైదరాబాద్ మీదుగా వెళ్తుంది. తిరిగి 18న తిరుపతికి చేరుకుంటుంది. ఇక నెల్లూరు బస్సు విజయవాడ, రాజమహేంద్రవరం, వైజాగ్ మీదుగా వెళ్లి 19న నెల్లూరుకు తిరిగిరానుంది.
Similar News
News January 19, 2026
గుండె పదిలంగా ఉండాలా? అయితే బెడ్ రూమ్ లైట్లు ఆపేయండి!

నిద్రపోయేటప్పుడు గదిలో వెలుతురు ఉంటే గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని JAMA Network Open తాజా స్టడీలో తేలింది. సుమారు 89,000 మంది గుండె పనితీరును ట్రాక్ చేశారు. లైట్లు వేసుకుని పడుకునే వారికి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ 47%, హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు 56% ఎక్కువగా ఉంటుందట. ఈ వెలుతురు బాడీలోని సర్కేడియన్ రిథమ్ను దెబ్బతీసి స్ట్రెస్ పెంచుతుందట. అందుకే హెల్తీగా ఉండాలంటే చీకట్లోనే నిద్రపోవాలి.
News January 19, 2026
సంపు ఏ దిశలో ఉంటే ఉత్తమం?

ఇంటి ప్రాంగణంలో బోరు, ఇంకుడు గుంతలు ఎక్కడున్నా, నీటిని నిల్వ చేసే ‘సంపు’ మాత్రం కచ్చితంగా ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశల్లోనే ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. సంపు కట్టేటప్పుడు అది ఇంటి మూలకు, ప్రహరీ గోడ మూలకు తగలకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. వాస్తుతో పాటు నిర్మాణ భద్రత వంటి శాస్త్రీయ కోణాలను కూడా దృష్టిలో ఉంచుకుని సంపు నిర్మాణం చేపడితే మేలు జరుగుతుందని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 19, 2026
ట్రంప్ విషయంలో సొంత పాలకుల పరువు తీసిన పాక్ జర్నలిస్ట్!

ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి పాక్ PM షరీఫ్, మిలిటరీ చీఫ్ మునీర్ ఆయన్ను 2సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. చివరకు వాళ్లకు వీసా బ్యాన్ బహుమతిగా దక్కింది. పాక్ పాలకుల ఈ వ్యూహాత్మక వైఫల్యాన్ని ఆ దేశంలో ప్రముఖ జర్నలిస్ట్ హమీద్ మీర్ బాహాటంగానే ఎండగట్టారు. పైగా ‘భారత్ ఎప్పుడూ ట్రంప్ను నోబెల్కు నామినేట్ చేయలేదు. అమెరికా విధానాలపై తనదైన దూరం పాటిస్తుంది’ అంటూ చురకలంటించారు.


