News February 3, 2025

సోషల్ మీడియాలో ఏపీ, తెలంగాణ ఫుడ్ వార్

image

సోషల్ మీడియాలో అభిమాన తారల గురించి వార్స్ చాలానే చూస్తున్నాం. తాజాగా Xలో కొందరు ఫుడ్ వార్‌కు తెరలేపారు. ఆంధ్ర, తెలంగాణ ఫుడ్‌లలో ఏది గొప్ప అంటూ చర్చ ప్రారంభించారు. కొందరు తమ ఫుడ్ గొప్ప అంటే తమ ఫుడ్ గొప్ప అని పోస్టులు చేస్తున్నారు. అయితే ఇలాంటి విషయాలపై కాకుండా ఏదైనా సమాజానికి మేలు చేసే అంశాలపై చర్చించాలని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 3, 2025

గ్రూప్-1 ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్

image

TG: గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి.

News February 3, 2025

ట్రంప్‌తో మోదీ భేటీ.. ఎప్పుడంటే?

image

PM మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని ఈ నెల రెండోవారంలో ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. ఆ సమయంలోనే ఆయన ఫిబ్రవరి 13న వాషింగ్టన్‌లో ట్రంప్‌తో భేటీ కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. మోదీతో సమావేశం నేపథ్యంలో ట్రంప్ డిన్నర్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గత నెల 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

News February 3, 2025

ఇది రాహుల్ అవివేకానికి నిదర్శనం: కిషన్ రెడ్డి

image

యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎన్డీఏ ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ గాంధీ అవివేకానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 2.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగితే ఎన్డీఏ పాలనలో ఒక్క 2024లోనే 4.9 కోట్లు సృష్టించినట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొందని Xలో తెలిపారు. వివిధ రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో పోలిస్తే NDA ప్రభుత్వంలోనే ఉపాధిలో వృద్ధి ఉందని వెల్లడించారు.