News October 29, 2024
ఏపీ టెట్ ఫైనల్ ‘కీ’ విడుదల

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫైనల్ కీ విడుదలైంది. cse.ap.gov.in వెబ్సైట్లో కీని పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. కాగా అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి.
Similar News
News December 8, 2025
సకల సంపద ‘విష్ణుమూర్తే’

వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః|
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః||
ఈ సృష్టిలోని సమస్త సంపద ఆ విష్ణుమూర్తే. ఆయన మన మంచి కోరుతాడు. ఎప్పుడూ సత్యంగా, అందరిపట్ల సమానంగా ఉంటాడు. ఆ అమోఘుడు పద్మం వంటి కళ్లతో వర్షాన్ని కురిపిస్తాడు. కురిసే వర్షం కూడా ఆయనే. ఈ ప్రపంచంలో ఉన్న సంపద, సత్యం, సమానత్వం.. అన్నీ భగవంతుడి స్వరూపాలే. అందుకే, మనమంతా ఆయనను ప్రేమతో, భక్తితో ధ్యానించాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 8, 2025
‘స్మృతి ఈజ్ బ్యాక్’.. ప్రాక్టీస్ షురూ

పలాశ్ ముచ్చల్తో పెళ్లి రద్దు తర్వాత భారత క్రికెటర్ స్మృతి తొలిసారి మీడియాకు కనిపించారు. ఈ నెల 21 నుంచి శ్రీలంకతో జరిగే T20 సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్న ఫొటో బయటకు వచ్చింది. కాగా పెళ్లి రద్దుపై తమ ప్రైవసీని గౌరవించాలని ఆమె విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రాక్టీస్ను ఉద్దేశించి ‘స్మృతి ఈజ్ బ్యాక్’ అంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
News December 8, 2025
MIDHANIలో 210 పోస్టులు.. అప్లై చేశారా?

మిశ్రమ ధాతు నిగమ్(MIDHANI)లో 210 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE, బీటెక్, ITI, డిప్లొమా అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా NATS పోర్టల్లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. ITI ట్రేడ్ అప్రెంటిస్కు నెలకు రూ.9,600, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు రూ.12,300, టెక్నీషియన్ అప్రెంటిస్కు రూ.10,900 చెల్లిస్తారు.


