News October 29, 2024

ఏపీ టెట్ ఫైనల్ ‘కీ’ విడుదల

image

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫైనల్ కీ విడుదలైంది. cse.ap.gov.in వెబ్‌సైట్‌లో కీని పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. కాగా అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి.

Similar News

News February 6, 2026

యుద్ధ భయాలు: ఇరాన్‌ను వీడాలని తమ పౌరులకు US హెచ్చరిక

image

ఇరాన్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని US వర్చువల్ ఎంబసీ ఆదేశించింది. భూమార్గంలో పొరుగున ఉన్న అర్మేనియా, టర్కీకైనా వెళ్లాలని సూచించింది. కుదరకపోతే సరిపడా ఫుడ్, వాటర్‌తో అక్కడే సేఫ్ ప్లేస్‌లో తలదాచుకోవాలని తెలిపింది. ఇంటర్నెట్‌లో అంతరాయం ఉండొచ్చని, లోకల్ న్యూస్ ఛానల్స్ ఫాలో అవ్వాలని సూచించింది. అణుఒప్పందం కుదరని పక్షంలో ఏమైనా జరగొచ్చని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

News February 6, 2026

ఇషాన్ కిషన్ టాప్-3లోనే ఆడతారు: సూర్య

image

T20 WCలో ఇషాన్ కిషన్ టాప్-3లోనే బ్యాటింగ్ చేస్తారని, అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్ చేయరని IND కెప్టెన్ సూర్య స్పష్టం చేశారు. NZ సిరీస్‌లో చూపించిన ఫామ్‌ను ఇషాన్ కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ‘<<19066790>>హర్షిత్ రాణా<<>> పరిస్థితిని ఫిజియోలు పరిశీలిస్తున్నారు. ఆడతారా లేదా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఆయన దూరమైతే గత రెండేళ్లలో బాగా రాణించిన ఫాస్ట్ బౌలర్‌ను తీసుకుంటాం’ అని తెలిపారు.

News February 6, 2026

సంపూర్ణ ఆహారం గొర్రెలకు అందకపోతే..

image

గొర్రెలకు సరైన పోషకాహారం అందకుంటే పెరుగుదల లోపించి త్వరగా బరువు పెరగవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి సులభంగా వ్యాధుల బారిన పడతాయి. అంతర, బాహ్య పరాన్న జీవుల కారణంగా గొర్రెలకు వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గొర్రెల ఉన్ని రాలిపోతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. గర్భస్రావాలు, పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా జన్మించడం, సకాలంలో ఎదకు రాకపోవడం, ఈతల మధ్య వ్యవధి పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.