News October 29, 2024

ఏపీ టెట్ ఫైనల్ ‘కీ’ విడుదల

image

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫైనల్ కీ విడుదలైంది. cse.ap.gov.in వెబ్‌సైట్‌లో కీని పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. కాగా అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి.

Similar News

News February 7, 2026

ఇండియాలో నివసించే ప్రతిఒక్కరూ హిందువే: మోహన్ భాగవత్

image

హిందూ అనే పదం పేరు కాదని, అది ఒక విశేషణం అని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఇండియాలో నివసించే ప్రతిఒక్కరినీ హిందువుగా సంబోధించొచ్చని పేర్కొన్నారు. RSS ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని తెలిపారు. తమకు అధికారం, పబ్లిసిటీ కూడా అవసరం లేదన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి యాక్టర్ సల్మాన్ ఖాన్, హేమా మాలినీ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

News February 7, 2026

100లో 31 మాత్రమే స్మార్ట్ సిటీలుగా మారాయ్!

image

100 నగరాల్లో కేవలం 31 మాత్రమే ఇప్పటి వరకు స్మార్ట్ సిటీలుగా మారినట్లు కేంద్రం ఓ RTIకి సమాధానమిచ్చింది. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కటీ లేవు. ఈ నగరాల కోసం పదేళ్లలో ₹59,385Cr ఖర్చు చేసింది. వైజాగ్ సహా మరో 43 నగరాల్లో పనులు దగ్గరపడినట్లు తెలిపింది. కాకినాడ, తిరుపతితో పాటు 26 పట్టణాలు స్మార్ట్ సిటీస్‌గా మారేందుకు టైమ్ పడుతుందని పేర్కొంది. 2025 మార్చి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది.

News February 7, 2026

ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ తమిళం: మోదీ

image

ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప వరం తమిళం అని ప్రధాని మోదీ అన్నారు. తమిళ సాహిత్యం, సంస్కృతి చాలా గొప్పవని మలేషియా పర్యటనలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. మానవాళికి తమిళ ప్రజలు తమదైన ప్రతిభతో సేవ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇండియా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సహా కేంద్ర క్యాబినెట్‌లో కీలక స్థానంలో తమిళులు ఉండడం గర్వంగా ఉందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారత సంస్కృతి అని గుర్తుచేశారు.