News October 29, 2024

ఏపీ టెట్ ఫైనల్ ‘కీ’ విడుదల

image

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫైనల్ కీ విడుదలైంది. cse.ap.gov.in వెబ్‌సైట్‌లో కీని పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. కాగా అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి.

Similar News

News January 30, 2026

అప్పుడే కొని ఉంటే బాగుండేది..!

image

అని బంగారం, వెండి కొనుగోలుపై అనుకుంటున్నారా? ‘ఇక పెరగదు’ అనుకున్న ప్రతిసారీ వీటి ధరలు షాక్ ఇస్తున్నాయి. కొందామని వాయిదా వేసుకున్నవాళ్లు ‘అప్పుడే కొని ఉంటే బాగుండేది’ అని నిట్టూరుస్తున్నారు. అటు ఏకంగా రూ.వేలల్లో ధరలు ఎగబాకుతుండటంతో వడ్డీ తీసుకొని అయినా వీటిపై పెట్టుబడి పెడితే బాగుంటుందనే చర్చ ట్రెండ్ అవుతోంది. మరోవైపు బ్యాంకుల్లో పుత్తడిపై లోన్లు తీసుకొనేవారూ ఇటీవల పెరిగినట్లు తెలుస్తోంది.

News January 30, 2026

కేజీ చికెన్ రూ.350, మటన్ రూ.1500!

image

TG: మేడారం జాతరలో వ్యాపారులు చికెన్, మటన్ ధరలను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. బయట కేజీ మటన్ ధర రూ.900-1000 ఉండగా, మేడారంలో రూ.1500కి విక్రయిస్తున్నారు. కిలో లైవ్ కోడి బయట రూ.170 ఉండగా, జాతరలో రూ.350కి అమ్ముతున్నారు. మద్యం బాటిళ్లపై రూ.100 చొప్పున పెంచినట్లు సమాచారం. తోటల్లో నీడ కోసం వెళ్లే వారికి ఒక్కో చెట్టును రూ.1000-రూ.2000కి అద్దెకు ఇస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు.

News January 30, 2026

మార్చినాటికి విజయవాడ బైపాస్ పూర్తి: గడ్కరీ

image

AP: గొల్లపూడి నుంచి చినకాకాని(17.88KM) వరకు చేపట్టిన VJA బైపాస్ MARనాటికి పూర్తవుతుందని కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. లోక్‌సభలో MP బాలశౌరి అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. ‘ఈ ప్రాజెక్టులో 4KM మేర మాత్రమే పనులు పెండింగ్ ఉన్నాయి. వాటిని మార్చి31 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని తెలిపారు. 2019లో ఈ 6వరసల బైపాస్ నిర్మాణానికి రూ.1,194cr అంచనావ్యయంతో అనుమతులిచ్చారు.