News October 29, 2024

ఏపీ టెట్ ఫైనల్ ‘కీ’ విడుదల

image

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫైనల్ కీ విడుదలైంది. cse.ap.gov.in వెబ్‌సైట్‌లో కీని పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. కాగా అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి.

Similar News

News February 3, 2026

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమదే: నిర్మలా సీతారామన్

image

అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశ్చితి వల్లే గోల్డ్ ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. పలు సెంట్రల్ బ్యాంకులు గోల్డ్‌లో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. ఏ దేశ కరెన్సీపైనా ఇన్వెస్టర్లకు నమ్మకం లేక బంగారం వైపు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. స్పెక్యులేటివ్ డెరివేటివ్ ట్రేడింగ్ జోలికి సామాన్యులు వెళ్లకూడదనే ఎఫ్‌&వోపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచామన్నారు.

News February 3, 2026

మహిళలూ.. ఈ లక్షణాలున్నాయా? జాగ్రత్త

image

క్యాన్సర్ లక్షణాలు అన్నిసార్లూ బయటకు కనిపించవు. ముఖ్యంగా మహిళల్లో కొన్ని క్యాన్సర్లు నిశ్శబ్ధంగా శరీరంలో వ్యాపిస్తాయంటున్నారు నిపుణులు. చాలా క్యాన్సర్లను ప్రారంభదశలో గుర్తించడం కష్టమని చెబుతున్నారు. అందుకే మహిళల్లో అసాధారణ వాపు, దీర్ఘకాల అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం, చర్మంపై మార్పులు, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News February 3, 2026

గతేడాది 19 విమాన ప్రమాదాలు

image

గతేడాది దేశంలో 19 విమాన ప్రమాదాలు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ ఘటనలపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు చేసిందని వెల్లడించారు. వీటికి సంబంధించిన నివేదికలను AAIB వెబ్‌సైట్‌లో ప్రచురించామని ఆయన తెలిపారు.