News October 29, 2024
ఏపీ టెట్ ఫైనల్ ‘కీ’ విడుదల

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫైనల్ కీ విడుదలైంది. cse.ap.gov.in వెబ్సైట్లో కీని పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. కాగా అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి.
Similar News
News February 12, 2026
భీమవరం: స్టేషన్ రికార్డుల నిర్వహణపై ఐజీ ఆకస్మిక తనిఖీ

భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీల్లో భాగంగా ఐజీ అశోక్ కుమార్ పరిపాలన, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా మహిళా రక్షణ, పోక్సో, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు తీరును విశ్లేషించారు. నేరాల నియంత్రణకు రాత్రిపూట గస్తీని మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
News February 12, 2026
11 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయిన భారత్

నమీబియాతో మ్యాచులో మరింత స్కోర్ చేయాల్సిన IND 209రన్స్కే పరిమితమైంది. ఒక దశలో 250 దాటుతుందని భావించినా ఇన్నింగ్స్ చివరి 11బంతుల్లో 5వికెట్లు కోల్పోవడంతో స్కోర్ పడిపోయింది. ఊపు మీదున్న పాండ్య 19వ ఓవర్ రెండో బాల్కు ఔట్ కాగా తర్వాతి బంతికి దూబే రనౌట్ అయ్యారు. అదే ఓవర్ చివరి బాల్కు అక్షర్ బౌల్డ్ అయ్యారు. 20వ ఓవర్ మూడో బంతికి రింకూ, చివరి బాల్కు అర్ష్దీప్ ఔటయ్యారు. 11 బాల్స్లో 4 రన్సే వచ్చాయి.
News February 12, 2026
T20 WC: భారత్ భారీ స్కోర్

నమీబియాతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 209/9 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (61), హార్దిక్ (52) రాణించారు. దూబే 23, శాంసన్ 22, తిలక్ 25, సూర్య 12 పరుగులు చేశారు. 19వ ఓవర్లో భారత్ 3 వికెట్లు(పాండ్య, దూబే, అక్షర్) కోల్పోవడంతో స్కోర్ కాస్త తగ్గింది.


