News October 29, 2024
ఏపీ టెట్ ఫైనల్ ‘కీ’ విడుదల

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫైనల్ కీ విడుదలైంది. cse.ap.gov.in వెబ్సైట్లో కీని పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. కాగా అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి.
Similar News
News January 26, 2026
మనది చరిత్రాత్మక బంధం.. ఇండియన్స్కు ట్రంప్ రిపబ్లిక్ డే విషెస్

భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశ ప్రజలు, ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య బంధం చరిత్రాత్మకమైనదని గుర్తుచేశారు. ఆయన మెసేజ్ను ఢిల్లీలోని US ఎంబసీ షేర్ చేసింది. టారిఫ్లు, ట్రేడ్ డీల్ విషయంలో ఇరు దేశాల మధ్య వివాదాలు కొనసాగుతున్నప్పటికీ.. ట్రంప్ నుంచి ఈ తరహా సందేశం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
News January 26, 2026
987 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్

కేంద్రీయ విద్యాలయాల్లో 987 స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో TGT 493, PRT 494 పోస్టులున్నాయి. 2026-27 విద్యాసంవత్సరానికి వీటిని భర్తీ చేయనున్నట్లు KVS వెల్లడించింది. జాబును బట్టి డిగ్రీ, డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్), BEd(స్పెషల్ ఎడ్యుకేషన్), CTET ఉత్తీర్ణులు అర్హులు. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి.
వెబ్సైట్: https://kvsangathan.nic.in/
News January 26, 2026
కొండెక్కిన వెండి ధర.. ఔన్స్కు $110!

అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఇవాళ <<18959429>>ఉదయం<<>> ఔన్స్కు $100 వద్ద ఉన్న ధర ప్రస్తుతం $110కి చేరింది. కేవలం నెల రోజుల్లోనే 54% పెరుగుదల నమోదు కాగా జనవరి 2025తో పోలిస్తే ఏకంగా 280% పెరిగిందని ట్రేడ్ నిపుణులు తెలిపారు. ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో వెండి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు.


