News October 29, 2024

ఏపీ టెట్ ఫైనల్ ‘కీ’ విడుదల

image

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫైనల్ కీ విడుదలైంది. cse.ap.gov.in వెబ్‌సైట్‌లో కీని పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. కాగా అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి.

Similar News

News November 11, 2025

టమాటాలో బాక్టీరియా ఎండు తెగులును ఎలా నివారించాలి?

image

బాక్టీరియా ఎండు తెగులు సోకిన టమాటా మొక్కలను పీకి దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి. మొక్కను తొలగించిన చోట వెంటనే బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. ఇలా చేయడం వల్ల బాక్టీరియా ఇతర మొక్కలకు సోకదు. టమాటా నారును నాటుకునే ముందే వేపపిండిని నేలలో చల్లుకోవడం వల్ల ఈ తెగులు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు. తెగులు సోకిన మొక్కలు పొలంలో ఉన్నప్పుడు నీటి తడులు ఇస్తే ఈ తెగులు ఉద్ధృతి మరింత పెరిగి నివారణ కష్టమవుతుంది.

News November 11, 2025

స్టాక్ మార్కెట్లో LIC ₹16 లక్షల కోట్ల పెట్టుబడి

image

LIC అంటే తెలియని వారుండరు. ఇందులో అనేకమంది భాగస్వామ్యం ఉంది. వారి సొమ్ము లక్షల కోట్లు ఇందులో ఉన్నాయి. ఇలా వచ్చిన సొమ్మును సంస్థ పలు రంగాల్లో పెట్టుబడులుగా పెడుతోంది. ఇలా ఇప్పటివరకు ₹16 లక్షల కోట్లు పెట్టింది. తాజాగా HDFC, ICICI వంటి ప్రయివేటు బ్యాంకుల షేర్లను విక్రయించి SBIలో పెట్టుబడి పెట్టింది. ఇటీవల అదానీ కంపెనీలో పెట్టుబడి పెట్టగా విమర్శలు రావడంతో స్వయంగానే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

News November 11, 2025

రాష్ట్రంలో 175 పారిశ్రామిక పార్కులు: CBN

image

AP: రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు నెలకొల్పుతామని CM CBN ప్రకటించారు. ‘ఇపుడు15 MSMEలు ప్రారంభించాం. మరో 35కి శంకుస్థాపన చేశాం. కొత్తగా మరో 70 ఏర్పాటుచేస్తాం’ అని చెప్పారు. వీటిలో 99 పరిశ్రమలు రానున్నాయన్నారు. ప్రధాని మోదీ దేన్ని ప్రవేశపెట్టినా APకి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో PPAల రద్దుతో ₹9వేల CR వృధా చేశారన్నారు. పెట్టుబడిదారులు తిరిగి వస్తున్నారన్నారు.