News October 27, 2024

నేడు ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల

image

AP: ఈ నెల 3 నుంచి 21 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షల ఫైనల్ కీ నేడు విడుదల కానుంది. https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 2న తుది ఫలితాలను అధికారులు రిలీజ్ చేస్తారు. ఈసారి టెట్‌కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 (86.28 శాతం) మంది హాజరయ్యారు.

Similar News

News October 27, 2024

16,347 ఉద్యోగాల భర్తీపై BIG UPDATE

image

AP: 16,347 DSC ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లు పరిశీలించి నివేదిక పంపించాలని డీఈవోలను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. గతంలో జిల్లాల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, సమాంతర రిజర్వేషన్లు, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్, స్పోర్ట్స్ కోటా అమలుపై వివరాలను ఈ నెల 28లోగా పంపాలంది. కాగా వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్సుంది.

News October 27, 2024

నవంబర్ 26న పార్లమెంటు ఉభయ సభల సమావేశం

image

భార‌త రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా Nov 26న పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ప్ర‌త్యేకంగా స‌మావేశంకానున్నాయి. Nov 26, 1949న రాజ్యాంగాన్ని ఆమోదించిన పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్‌లోనే లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు భేటీ అవుతారు. గ‌తంలో Nov 26న National Law Day నిర్వ‌హించే వారు. అయితే, 2015లో అంబేడ్క‌ర్‌125వ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఆ రోజును Constitution Dayగా ప్ర‌క‌టించారు.

News October 27, 2024

‘హైడ్రా’కు హండ్రెడ్ డేస్.. ఇకపై తగ్గేదేలే: రంగనాథ్

image

TG: హైడ్రా సైలెంట్ కాలేదని, మరింత బలోపేతం అవుతోందని హైడ్రా ఏర్పడి వందరోజులైన సందర్భంగా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇకపై పక్కా ప్లాన్, ఆధారాలతో ముందడుగు వేస్తామన్నారు. త్వరలోనే చెరువులన్నింటికీ FTL, బఫర్ జోన్లు ఫిక్స్ చేస్తామని చెప్పారు. గడిచిన వంద రోజుల్లో ఆక్రమణదారులకు హైడ్రా సింహస్వప్నంలా మారిందని రంగనాథ్ వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా అన్నీ చెక్ చేసుకున్నాకే స్థలాలు కొంటున్నారని తెలిపారు.