News October 6, 2025
ఏపీ అప్డేట్స్

* కర్ణాటకలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్.. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ గోపాల గౌడ అమృత మహోత్సవం కార్యక్రమానికి హాజరు
* విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థులను పరామర్శించిన హోంమంత్రి అనిత.. కురుపాం ఘటనపై నిపుణుల కమిటీతో విచారణ చేపడుతామని వెల్లడి
* ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగింపు.. ఇవాళ్టితో గడువు ముగియడంతో ఏసీబీ కోర్టులో హాజరు
Similar News
News October 6, 2025
వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

2025కు సంబంధించి వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు. రోగనిరోధక శక్తిపై పరిశోధనలకు గాను మేరీ బ్రాంకౌ (అమెరికా), ఫ్రెడ్ రామ్స్డెల్ (అమెరికా), షిమన్ సకాగుచి (జపాన్)లకు నోబెల్ ప్రైజ్లు వచ్చాయి.
News October 6, 2025
విష్ణువుపై వ్యాఖ్యలు.. CJIపై దాడికి కారణమిదేనా?

SCలో CJI BR గవాయ్పై ఓ వ్యక్తి వస్తువు విసిరేందుకు యత్నించడం తెలిసిందే. MPలోని ఖజురహో టెంపుల్లో ధ్వంసమైన విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలన్న పిటిషన్పై విచారణ సమయంలో CJI వ్యాఖ్యలే దాడికి కారణంగా తెలుస్తోంది. ‘ఈ సైట్ ASI పరిధిలో ఉంది. మీరు విష్ణువు పరమ భక్తుడని చెబుతున్నారు కదా. వెళ్లి ప్రార్థించండి. ఏదైనా చేయమని అడగండి’ అంటూ పిటిషన్ను కొట్టేశారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
News October 6, 2025
రొమ్ము క్యాన్సర్ కచ్చితంగా తగ్గుతుంది: డా.విశాల్

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది అపోహ మాత్రమేనని హేమాటో ఆంకాలజిస్ట్ డా.విశాల్ టోకా స్పష్టం చేశారు. ‘తొలి దశలో ఆంకో ప్లాస్టీ అనే శస్త్రచికిత్సతో రొమ్మును రక్షిస్తూ క్యాన్సర్ను ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. రెండో దశలోనూ పూర్తిగా తగ్గించవచ్చు. 3, 4 దశల్లో ఆపరేషన్, రేడియేషన్, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సల అవసరం పడవచ్చు. కచ్చితంగా క్యాన్సర్ తగ్గుతుంది’ అని పేర్కొన్నారు.