News February 1, 2025

APకి మోదీ అండదండలు ఎప్పుడూ ఉంటాయి: పవన్

image

AP: కేంద్ర బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ఈ బడ్జెట్ వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉంది. ఏపీకి మోదీ అండదండలు ఎప్పుడూ ఉంటాయి. పోలవరం విషయంలో సవరించిన అంచనాలకు ఆమోదంతో ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. విశాఖ ఉక్కు పరిశ్రమకు నిధుల కేటాయింపుతో ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని తేలింది’ అని పవన్ అన్నారు.

Similar News

News November 22, 2025

peace deal: ఉక్రెయిన్‌ను బెదిరించి ఒప్పిస్తున్న అమెరికా!

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి 28 పాయింట్లతో కూడిన <<18346240>>పీస్ ప్లాన్‌<<>>ను అందజేసింది. అయితే దీన్ని అంగీకరించాలని ఉక్రెయిన్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే నిఘా సమాచారం, ఆయుధాల సరఫరాలను తగ్గిస్తామని బెదిరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే గురువారం లోగా ఒప్పందంపై సంతకం చేయాలని చెప్పినట్లు తెలిపాయి.

News November 22, 2025

Photo: మెరిసిపోతున్న ఢిల్లీని చూశారా?

image

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన అద్భుత ఫొటోలను నాసా SMలో షేర్ చేసింది. ఢిల్లీ, టోక్యో, న్యూయార్క్, సింగపూర్ వంటి నగరాలు రాత్రి పూట వెలిగిపోతున్నాయి. ఇవి స్పేస్ నుంచి కనిపించే అత్యంత ప్రకాశవంతమైన అర్బన్ సెంటర్లు అని నాసా క్యాప్షన్ ఇచ్చింది. వాటిలో ఢిల్లీ వ్యూ మాత్రం కళ్లుచెదిరేలా ఉంది. సిటీని విభజిస్తున్న యమునా నది, విద్యుత్ దీపాల వెలుగుల్లో సీతాకోకచిలుకలా అందంగా కనిపిస్తోంది.

News November 22, 2025

రెండో టెస్ట్: సమర్పిస్తారా? సమం చేస్తారా?

image

ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఇవాళ్టి నుంచి రెండో టెస్టు మొదలు కానుంది. గువాహటి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు గిల్ దూరం కాగా, రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. తొలి టెస్టు మాదిరే ఇందులోనూ గెలవాలని సౌతాఫ్రికా ఉవ్విళ్లూరుతోంది. ఒకవేళ మ్యాచ్ డ్రా అయినా సిరీస్ ప్రొటీస్ సొంతం కానుంది. మరోవైపు ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఉ.9.00 మ్యాచ్ ప్రారంభం కానుంది.