News September 25, 2024
కూలగొట్టడం తప్ప.. కొత్తవి నిర్మించే తెలివి లేదు: మాజీ మంత్రి
TG: రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే రైతు భరోసాని అమలు చేయాలన్నారు. తెలంగాణలో పోలీస్ రాజ్యం మొదలుపెట్టారని అన్నారు. పోలీసులు నిబంధనలు అతిక్రమించి చిన్న తప్పు చేసినా శిక్షార్హులు అవుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఉన్నవి కూలగొట్టడం తప్ప, కొత్తవి నిర్మించే తెలివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.
Similar News
News September 25, 2024
ఈ ఆరుగురు క్రికెటర్లు 8 వరల్డ్ కప్స్ ఆడారు!
ఇప్పటి వరకు మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీలు 8సార్లు జరగగా ఆరుగురు క్రికెటర్లు వాటన్నింటిలోనూ ఆడారు. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఎలీస్ పెర్రీ, న్యూజిలాండ్కు చెందిన బ్యాటర్ సుజీ బేట్స్, ఆల్రౌండర్ సోఫీ డివైన్, శ్రీలంక కెప్టెన్ చామరి ఆటపట్టు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ స్టెఫానీ టేలర్ ఆ జాబితాలో ఉన్నారు. కాగా వచ్చే నెల 3 నుంచి టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్ UAEలో మొదలుకానుంది.
News September 25, 2024
కారుకు గీతలు గీశారని చిన్నారులపై కేసు
TG: కారుకు గీతలు గీశారని 8 మంది పిల్లలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ చిన్నారులంతా 2 నుంచి 9 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. హనుమకొండలోని ఓ ఫ్లాట్లో నివసించే CID కానిస్టేబుల్ కారుపై చిన్నారులు ఆడుకుంటూ గీతలు గీశారు. కారు మరమ్మతులకు డబ్బులు ఇస్తామని పిల్లల తల్లిదండ్రులు చెప్పినా వినకుండా ఆయన సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News September 25, 2024
హైదరాబాద్-అయోధ్య విమాన సర్వీసులు
శంషాబాద్ నుంచి రాముడి జన్మస్థానమైన అయోధ్యకు ఈ నెల 27 నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారంలో నాలుగు రోజులు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ నెల 28 నుంచి ప్రయాగ్ రాజ్, ఆగ్రాకు కూడా రెండు సర్వీసులను ఇండిగో ప్రారంభించనుంది. వారంలో 3 రోజులు ఈ విమానాలు తిరుగుతాయి. అటు ప్రతి సోమ, మంగళవారాల్లో అగర్తల, జమ్మూలకు విమాన సర్వీసులు ఉంటాయని ఇండిగో ప్రకటించింది.