News September 25, 2024
కూలగొట్టడం తప్ప.. కొత్తవి నిర్మించే తెలివి లేదు: మాజీ మంత్రి

TG: రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే రైతు భరోసాని అమలు చేయాలన్నారు. తెలంగాణలో పోలీస్ రాజ్యం మొదలుపెట్టారని అన్నారు. పోలీసులు నిబంధనలు అతిక్రమించి చిన్న తప్పు చేసినా శిక్షార్హులు అవుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఉన్నవి కూలగొట్టడం తప్ప, కొత్తవి నిర్మించే తెలివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.
Similar News
News October 15, 2025
‘X’లో కొత్త సెక్యూరిటీ ఫీచర్లు

తమ ప్లాట్ఫామ్లో కంటెంట్ అథెంటిసిటీ కోసం కొత్త ఫీచర్లు తీసుకురానున్నట్లు ‘X’ వెల్లడించింది. ముఖ్యంగా మీరు కంటెంట్ చూస్తున్న అకౌంట్ ఏ దేశం నుంచి ఆపరేట్ అవుతోందో డిస్ప్లే చేస్తారు. వాళ్లు ‘X’లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎన్నిసార్లు యూజర్ నేమ్ ఛేంజ్ చేశారు, ఎలా కనెక్ట్ అయ్యారు అనే విషయాలు ప్రదర్శిస్తారు. త్వరలోనే దీనిని అందుబాటులోకి తెస్తామంది. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో రాబోతున్నట్లు తెలిపింది.
News October 15, 2025
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కు సిద్ధమైన ‘కన్నప్ప’

మంచు విష్ణు, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ‘కన్నప్ప’ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కు సిద్ధమైంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, శరత్ కుమార్ నటించిన విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ మూవీని జెమినీలో అక్టోబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకు ప్రీమియర్గా ప్రదర్శించబోతోన్నారు.
News October 15, 2025
ఇండో-అమెరికన్ ఆష్లీ టెల్లిస్ అరెస్ట్

ఇండో అమెరికన్ ఆష్లీ టెల్లిస్(64)ను వర్జీనియాలో అరెస్టు చేశారు. ఆయన US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్లో సీనియర్ అడ్వైజర్గా ఉన్నారు. ఆయన జాతీయ రక్షణకు సంబంధించి టాప్ సీక్రెట్స్ దొంగిలించారని, చైనా అధికారులను కలిశారని ఆరోపణలు ఉన్నట్లు US మీడియా పేర్కొంది. ఈయన ముంబైలో జన్మించారు. ఆష్లీ టెల్లిస్ విదేశాంగ విధాన నిపుణుడు, వ్యూహకర్త. అంతర్జాతీయ భద్రత, రక్షణ, ఆసియా వ్యూహాత్మక అంశాలపై విశేష ప్రావీణ్యం ఉంది.